బ్రేకింగ్ న్యూస్: ఇంట్లో ఏకంగా 11 మృతదేహాలు, ఆత్మహత్య?

Published : Jul 01, 2018, 09:21 AM ISTUpdated : Jul 01, 2018, 09:37 AM IST
బ్రేకింగ్ న్యూస్: ఇంట్లో ఏకంగా 11 మృతదేహాలు, ఆత్మహత్య?

సారాంశం

ఇంట్లో ఏకంగా ఓ కుటుంబానికి చెందిన 11 మంది మరణించారు. 

న్యూఢిల్లీ: ఇంట్లో ఏకంగా ఓ కుటుంబానికి చెందిన 11 మంది మరణించారు. ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

మృతుల్లో ఏడుగురు మహిళలు కాగా, నలుగురు పురుషులు. కుటుంబం ఫర్నీచర్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం.

అందరి కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. శవాలు ఇంటి ఆవరణలో పైకప్పునకు వేలాడుతూ కనిపించాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. 

ఆత్మహత్య కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్య కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Snake: కోబ్రా కాటేసినా నో టెన్షన్.. ఈ కన్నీళ్లు మీ ప్రాణాలు కాపాడతాయి.. అసలు మ్యాటర్ ఇదీ!
Gold: ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం ఏదో తెలుసా? ఆ నంబర్ చూస్తే షాకవుతారు !