ఘోర ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు.. 10 బోగీలు బోల్తా..

By Rajesh KarampooriFirst Published Feb 18, 2024, 12:40 AM IST
Highlights

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఓ ఘోర రైలు ప్రమాదం సంభవించింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దాని 10 బోగీలు బోల్తాపడ్డాయి. ఢిల్లీలోని పటేల్ నగర్‌-దయాబస్తీ సెక్షన్‌లో చారమండి జకీరా ఫ్లై ఓవర్ సమీపంలో ఈ రైలు ప్రమాదం జరిగింది.

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని పటేల్ నగర్‌-దయాబస్తీ సెక్షన్‌లో చారమండి జకీరా ఫ్లై ఓవర్ సమీపంలో   గూడ్స్ రైలు బోల్తా పడింది. సమాచారం ప్రకారం.. గూడ్స్ రైలు 10 కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, రైల్వే, అగ్నిమాపక దళం,  ఇతర సహాయ మరియు సహాయక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. గూడ్స్ రైలులో ఐరన్ షీట్ రోల్స్ ఎక్కించారని రైల్వే తెలిపింది. పటేల్ నగర్-దయాబస్తీ సెక్షన్ మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఈ గూడ్స్ రైలు ముంబై నుంచి చండీగఢ్ వెళ్తోంది.

కంపార్ట్‌మెంట్‌లో మంటలు

మంగళవారం మధ్యాహ్నం సెంట్రల్ ఢిల్లీలోని పటేల్ నగర్ రైల్వే స్టేషన్‌లో నిలబడి ఉన్న ఖాళీ ప్యాసింజర్ రైలు కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ మేరకు అగ్నిమాపక శాఖ అధికారి సమాచారం అందించారు. మధ్యాహ్నం 1:33 గంటలకు డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందిందని, ఐదు ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి పంపామని అధికారి తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

మంటలు అదుపులోకి

మధ్యాహ్నం 2.25 గంటలకు మంటలు అదుపులోకి వచ్చినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ (డీఎఫ్‌ఎస్) అధికారి తెలిపారు. మూడో నంబర్ ప్లాట్‌ఫాంపై నిలబడి ఉన్న సిర్సా ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో మంటలు చెలరేగాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో అన్ని కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయని అధికారి తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అయి ఉండవచ్చని తెలిపారు.

click me!