రాజమండ్రిలో మురళీమోహన్ కోడలు ఆధిక్యం

By telugu teamFirst Published May 23, 2019, 9:18 AM IST
Highlights

ఏపీలో ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. గురువారం ఉదయం 8గంటలకు ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రారంభించారు.

ఏపీలో ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. గురువారం ఉదయం 8గంటలకు ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రారంభించారు. కాగా.. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. రాజమండ్రిలో టీడీపీ ముందంజలో ఉంది. టీడీపీ ఎంపీ మురళీ మోహన్ కోడలు, రాజమండ్రి టీడీపీ అభ్యర్థి రూప ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.

click me!