Kumbh Mela Boatman పడవల యజమానికి కథే మారిందిగా! మహాకుంభ్ తో రూ. 30 కోట్ల సంపాదన..

Published : Mar 06, 2025, 10:22 AM IST
Kumbh Mela Boatman పడవల యజమానికి కథే మారిందిగా! మహాకుంభ్ తో రూ. 30 కోట్ల సంపాదన..

సారాంశం

మహాకుంభ్ లో స్నానం ఆచరించడంతో భక్తులకు దక్కిణ పుణ్యం సంగతి అటుంచితే ఒక పడవల యజమాని 45 రోజుల్లో ఏకంగా రూ.30 కోట్లు సంపాదించాడు. యూపీ ముఖ్యమంత్రి యోగి స్వయంగా ఈ విషయం చెప్పారు.

ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ మత విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు వేదిక కావడమే కాదు.. లక్షలాది మందికి జీవనోపాధినిచ్చే పెద్ద వ్యాపార వేదికగా కూడా నిలిచింది. ఆటో నడిపేవాళ్ల దగ్గర్నుంచి, తిండి కొట్టు పెట్టుకునేవాళ్ల వరకు, పడవ నడిపేవాళ్ల వరకు లక్షలాది మంది జీవితాల్ని ఈ మహా కుంభ్ మార్చేసింది. అలాంటి ఓ నావికుడి సక్సెస్ స్టోరీని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చెప్పారు. అతగాడు ప్రయాగ్‌రాజ్‌లో ఉంటాడు.

*130 పడవల కుటుంబానికి 30 కోట్ల ఆదాయం* 

ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ 45 రోజుల్లో ఎన్నో రికార్డులు సృష్టించింది. అయితే సీఎం యోగి మంగళవారం అసెంబ్లీలో ఓ పడవ నడిపే వ్యక్తి గురించి చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ నావికుడు మహాకుంభ్‌లో 45 రోజుల్లో 30 కోట్లు సంపాదించాడట. అతడి పేరు పింటూ మహరా. ప్రయాగ్‌రాజ్‌లోని అరైల్ ప్రాంతంలో ఉంటాడు. త్రివేణి నది ఒడ్డున ఉన్న అరైల్ గ్రామంలో ఉండే ఈ నావికుడు తీసుకున్న ఓ నిర్ణయం అతడి కుటుంబం జీవితాన్నే మార్చేసింది. మహాకుంభ్ అయిపోయే సరికి పింటూ కోటీశ్వరుల లిస్టులో చేరిపోయాడు. 2019లో యోగి సర్కార్ దివ్యంగా, గొప్పగా నిర్వహించిన కుంభ్‌లో తాను పడవ నడిపానని పింటూ మహరా చెప్పాడు. ఆ కుంభ్‌తోనే ఈసారి మహాకుంభ్‌కు చాలా మంది భక్తులు వస్తారని అంచనా వేశానన్నాడు. అందుకే మహాకుంభ్‌కు ముందు తన కుటుంబం కోసం 70 పడవలు కొన్నాడు. అంతకుముందు తన దగ్గర 60 పడవలు ఉండేవి. మొత్తంగా 130 పడవల్ని మహాకుంభ్‌లో నడిపి తన కుటుంబానికి చాలా ఆదాయం వచ్చేలా చేశాడని, ఇక తమ తరతరాల జీవితాలు బాగుపడతాయని సంతోషంగా చెప్పాడు.

*నావికుల జీవితాల్లో వెలుగులు నింపిన యోగి, మోదీ* 

యోగి, మోదీ ప్రయత్నాలతో జరిగిన ఈ దివ్యమైన, గొప్ప మహాకుంభ్ తమకే కాదు, వేల సంఖ్యలో పడవ నడిపే కుటుంబాల జీవితాల్ని మార్చిందని పింటూ మహరా, అతడి కుటుంబం చెబుతోంది. తనతో పాటు చుట్టుపక్కల ఉన్న వేల మంది నావికుల జీవితాల్ని ఈ మహాకుంభ్ మార్చేసిందని పింటూ మహరా అన్నాడు. అప్పులు చేసి పడవలు కొన్నవాళ్లంతా ఇప్పుడు లక్షాధికారులుగా తిరుగుతున్నారని చెప్పాడు. తన భర్త చనిపోయాక ఆర్థిక పరిస్థితి సరిగా లేదని పింటూ తల్లి శుక్లావతి దేవి కన్నీళ్లతో చెప్పింది. కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో ఉంటే మహాకుంభ్ తమకు దేవుడిలా వచ్చిందని తెలిపింది. యోగి గారు ఈ మహాకుంభ్‌ను చక్కగా నిర్వహించడం వల్ల చాలా మంది త్రివేణిలో స్నానాలు చేయడానికి వచ్చారని, దానివల్లే తమకు ఆదాయం వచ్చిందని చెప్పింది.

PREV
click me!

Recommended Stories

Egg Expiry Date : ఇక కోడిగుడ్లపై కూడా ఎక్స్‌పైరీ డేట్.. అసలివి ఎన్నిరోజులు నిల్వ ఉంటాయో తెలుసా?
Vitamin D Deficiency: విటమిన్ డి లోపమా? మీ శరీరంలో ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా?