గుడ్ బాయ్ గో టూ అయోధ్య.. మరి బ్యాడ్ బాయ్..?

By Ramya SridharFirst Published Jan 24, 2024, 11:43 AM IST
Highlights

గుడ్ బాయ్ గో టూ హెవెన్.. బ్యాడ్ బాయ్ గో టూబ్యాంకాంక్. ఈ పాట అప్పట్లో ఫుల్ ట్రెండ్ అయ్యింది. కాగా.. తాజాగా ఈ పాటకు అయోధ్యను మిక్స్ చేసి పేరడీ చేశారు. అదికూడా .. ప్రధాని నరేంద్రమోదీ, రాహుల్ గాంధీ ఫోటోలతో చేయడం విశేషం.

ప్రస్తుతం ఎక్కడ విన్నా.. అయోధ్య పేరే వినపడుతోంది. అయోధ్యలో రామ మందిరం ఎప్పుడు ఏర్పాటు చేస్తారా చాలా సంవత్సరాలుగా రామభక్తులు ఎదురుచూశారు. చివరకు  ఆరోజు రానే వచ్చింది. అయోధ్యలో రాముడిని ప్రతిష్టించారు. దీంతో.. రామయ్యను వీక్షించేందుకు  క్యూలు కడుతున్నారు. కాగా.. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది.

ఇంతకీ అసలు మ్యాటరేటంటే... టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించిన కుమారి 21ఎఫ్ సినిమా గుర్తుందా..? ఆ సినిమా గుర్తులేకపోయినా.. అందులోని ఓపాట మాత్రం అందిరకీ బాగా గుర్తుంటుంది.. గుడ్ బాయ్ గో టూ హెవెన్.. బ్యాడ్ బాయ్ గో టూబ్యాంకాంక్. ఈ పాట అప్పట్లో ఫుల్ ట్రెండ్ అయ్యింది. కాగా.. తాజాగా ఈ పాటకు అయోధ్యను మిక్స్ చేసి పేరడీ చేశారు. అదికూడా .. ప్రధాని నరేంద్రమోదీ, రాహుల్ గాంధీ ఫోటోలతో చేయడం విశేషం.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mayur Jumani (@mayurjumani)

ఓ ఔత్సాహికుడు.. ఈ పాటను పాడాడు. గుడ్ బాయ్ గో టూ అయోధ్య.. బ్యాడ్ బాయ్ గో టూ బ్యాంకాంక్ అంటూ పాడాడు.. విజువల్స్ లో మోదీ మాట్లాడిన మాటలు, ఆయన ఫోటోలు పెట్టి.. చివరలో రాహుల్ గాంధీ ఫోటో కూడా పెట్టడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. చాలా మంది ఆ పాటకు.. రీల్స్ కూడా చేస్తుండటం విశేషం.. మిలియన్లకు పైగా వ్యూస్ వస్తున్నాయి. 

ఇంతకీ.. ఈ వీడియో మీరు చూశారా..? మీరు అయోధ్య వెళ్లాలని అనుకుంటున్నారా లేక... బ్యాడ్ బాయ్స్ లా బ్యాంకాంక్ వెళతారా..? ఎక్కడికి వెళ్లినా.. ముందు నెట్టింట వైరల్ అవుతున్న వీడియోని మాత్రం చూసేయండి..

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ranju (@ranju_neeru)


 

click me!