United Nations: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రపంచం పెద్ద ప్రమాదంలో ఉందని హెచ్చరించారు. అన్ని దేశాలు అప్రమత్తం కావాల్సిన అవసరముందనీ, ప్రపంచ నాయకులను అప్రమత్తం చేశారు.
UN Secretary-General Antonio Guterres: యావత్ ప్రపంచం ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అన్నారు. ప్రపంచ నాయకులు, దేశాలు అప్రమత్తం కాకుంటే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. గత మూడేండ్లలో మొదటిసారి వ్యక్తిగతంగా అందరూ హాజరైన ఐరాస సమావేశం సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నెలకొన్న ప్రపంచ నాయకుల మధ్య సంఘర్షణలు, రాజకీయ సంక్షోభ పరిస్థితులు, వాతావరణ విపత్తులను ఎదుర్కొవడం, పెరుగుతున్న పేదరికం, అసమానతలు తగ్గించడం కోసం పోరాడాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అధ్వాన్నంగా మారిన శక్తుల మధ్య విభజనను పరిష్కరించాలని పేర్కొన్నారు.
మంగళవారం నాయకుల సమావేశం ప్రారంభానికి దారితీసిన ప్రసంగాలు.. వ్యాఖ్యలలో క్రమంలో సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ గ్రహాన్ని రక్షించడం కోసం తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావించారు. ప్రస్తుతం మంటల్లో చిక్కుకున్న పరిస్థితిలో ఉన్నామంటూ పేర్కొన్న ఆయన.. కోవిడ్-19ను ఎదుర్కొవడానికి తీసుకున్న మెరుగైన చర్యలను సైతం ప్రస్తావించారు. అయితే, "అభివృద్ధి చెందుతున్న దేశాలు కోలుకోవడానికి ఆర్థిక ప్రాప్యత లేకపోవడం.. ఒక తరంలో చూడని సంక్షోభమనీ, విద్య, ఆరోగ్యం,మహిళల హక్కుల కోసం భూమిని కోల్పోయిందని అన్నారు. భౌగోళిక రాజకీయ విభజనలు మనందరినీ ప్రమాదంలో పడేస్తున్న పరిష్కారాలపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరముందని ఐరాస ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు.
We can still rescue the and get back on track to building a better world that leaves no one behind.
Young people are demanding action across all areas. We cannot let them down.
Let’s get to work. pic.twitter.com/uFaRCR0wms
కాగా, ప్రస్తుతం జరగబోయే సమావేశాల్లో చాలా మందికి ఉక్రెయిన్-రష్యా వార్ ప్రధాన ఎజెండాలో అగ్రస్థానంలో ఉంది. రష్యా ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై దాడి చేయడం, దాని చిన్న పొరుగు దేశ సార్వభౌమాధికారాన్ని బెదిరించడమే కాకుండా.. ఇప్పుడు రష్యా ఆక్రమిత ఆగ్నేయ ప్రాంతంలోని యూరప్లోని అతిపెద్ద అణు కర్మాగారంలో అణు విపత్తు గురించి భయాలను పెంచింది. అనేక దేశాలలో నాయకులు విస్తృత యుద్ధాన్ని నిరోధించడానికి, ఐరోపాలో శాంతిని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, దౌత్యవేత్తలు ఈ వారం ఎటువంటి పురోగతిని ఆశించడం లేదు. ఉక్రెయిన్-రష్యా నుండి అనేక దేశాలకు ధాన్యం, ఎరువుల ఎగుమతులు ఉంటాయి. అయితే, యుద్ధం కారణంగా ఎగుమతులు నిలిచిపోయి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార సంక్షోభానికి దారితీసింది. అనేక ఇతర దేశాలలో ద్రవ్యోల్బణం-పెరుగుతున్న జీవన వ్యయం అనే అంశాలు ఎజెండాలో ఎక్కువగా ఉన్నాయి.
It’s simple: Education systems today simply don’t make the grade.
At the Summit, I urged world leaders to find & support solutions to ensure everyone can learn, thrive & dream throughout their lives. pic.twitter.com/gv6lMBK5II
2030 వరకు ఐరాస లక్ష్యాలను ప్రోత్సహించడానికి సోమవారం జరిగిన సమావేశంలో తీవ్రమైన పేదరికాన్ని అంతం చేయడం, పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడం, లింగ సమానత్వాన్ని సాధించడం వంటి వాటితో సహా అనేక రాజకీయ భౌగోళిక రాజకీయ అంశాలు, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రాధాన్యతలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం చోటుచేసుకున్న కొన్ని అంతర్జాతీయ పరిణామాలు అడ్డంకులుగా మారాయి.