
బ్రిటన్ వీసాల విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్న భారతీయులకు బ్రిటీష్ హైకమిషనర్ శుభవార్త చెప్పింది. భారతదేశంలోని బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ ప్రకారం.. భారతీయులకు 15 రోజుల్లో UK వీసా లభిస్తుందని తెలిపారు. వీసా దరఖాస్తుల నిర్వహణకు సంబంధించిన ప్రమాణాలపై బ్రిటిష్ హైకమిషన్ వేగంగా పనిచేస్తోందని, తద్వారా ప్రజలు త్వరగా వీసాలు పొందవచ్చని ఆయన చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే భారతీయ విద్యార్థుల సంఖ్య 89 శాతం పెరిగిందని, అయితే స్కిల్డ్ వర్కర్ వీసాల ప్రాసెసింగ్ వేగంగా జరిగిందని, విజిటర్ వీసాల సమయానికి తగిన శ్రద్ధ చూపుతున్నామని చెప్పారు.
భారతదేశం నుండి ముఖ్యంగా యుకెకు ప్రయాణానికి అపూర్వమైన డిమాండ్ పెరిగిందని ఎల్లిస్ ఎత్తి చూపారు. కరోనావైరస్ మహమ్మారి, ఉక్రెయిన్పై రష్యా దాడి కారణంగా యూకే 15 రోజుల వర్క్ వీసా ప్రమాణాన్ని రద్దు చేసింది. ఢిల్లీ, UK మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ బృందాల సమిష్టి కృషి ద్వారా తాము గొప్ప పని చేస్తున్నామని అన్నారాయన. తాను విషయం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాననీ, తాము మళ్ళీ సరైన పని చేస్తున్నామని భావిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు మిస్టర్ ఎల్లిస్ ఒక వీడియో సందేశాన్ని షేర్ చేశారు.
యూకేలో చదువుకునేందుకు వీసాలు పొందడంలో చైనాను భారత్ అధిగమించింది. జూన్ 2022 నాటికి.. సుమారు 118,000 మంది భారతీయ విద్యార్థులు విద్యార్థి వీసాలు పొందారు, ఇది గత సంవత్సరం కంటే 89 శాతం పెరిగింది. భారతీయ పర్యాటకులకు యూకే అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది. జూన్ 2022 చివరి నాటికి, 258,000 కంటే ఎక్కువ మంది భారతీయ పౌరులు పర్యాటక వీసాలు పొందారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 630 శాతం అధికం. గత సంవత్సరం కోవిడ్-19 మహమ్మారి కారణంగా, ప్రయాణ ఆంక్షలు ఇప్పటికీ అమలులో ఉన్నవిషయం తెలిసిందే..