India pakistan: భార‌త క్షిప‌ణి ఆఫ్గ‌నిస్తాన్‌లో ప‌డిందా.? పాక్ ఆరోప‌ణ‌పై స్పందించిన‌ తాలిబాన్

కుక్క తోక‌ర వంక‌ర అన్న‌ట్లు పాకిస్థాన్ బుద్ధి ఎప్ప‌టికీ మార‌డం లేదు. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని అంగీక‌రించిన మూడు గంట‌ల్లోనే మ‌ళ్లీ దాడులు చేసిన జిత్తుల మారి పాకిస్థాన్‌.. భార‌త్‌పై విష ప్ర‌చారం చేస్తూనే ఉంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా పాక్ చేసిన కొన్ని వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. 
 

Google News Follow Us

అబ‌ద్ధ‌పు ప్ర‌చారాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది పాకిస్థాన్. భార‌త్‌పై తాము దాడులు చేశామ‌ని, ఈ దాడిలో భార‌త్ తీవ్రంగా న‌ష్ట‌పోయిందంటూ నోటికొచ్చిన‌ట్లు వాగిన పాక్ తాజాగా మ‌రో దుష్ప్ర‌చ‌రాన్ని మొద‌లు పెట్టింది. పాకిస్థాన్ ఆర్మీ ప్ర‌తినిధి లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ అహ్మ‌ద్ ష‌రీఫ్ మాట్లాడుతూ.. "భారత్ నుంచి ప్రయోగించిన ఓ క్షిపణి ఆఫ్ఘనిస్థాన్‌లో పడింది" అనే అన్నారు. 

అయితే దీనిపై వెంటనే ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్ ప్రభుత్వం స్పందించింది. ఈ వ్యాఖ్య‌ల్లో ఏ మాత్రం నిజం లేద‌ని తేల్చి చెప్పింది. ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఎనాయతుల్లా ఖవారిజ్మీ ఈ ఆరోపణను “అసత్యం”గా అభివర్ణించారు. 

“ఇలాంటి ఎలాంటి ఘటన జరగలేదు. ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా సురక్షితంగా ఉంది” అని ఖవారిజ్మీ స్పష్టం చేశారు. ఖామా ప్రెస్, హురియత్ రేడియోలు ఈ విషయాన్ని స్ప‌ష్టం చేశాయి. ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం కూడా పాక్ ఆరోపణలను తిరస్కరించింది. ఈ ఆరోపణలు పూర్తిగా తప్పు అని భార‌త్ పేర్కొంది. దీంతో పాకిస్థాన్ బుద్ధి ఎలాంటిదో మ‌రోసారి ప్ర‌పంచానికి అర్థ‌మైంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  
 

Read more Articles on