వాషింగ్టన్ : అమెరికాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తప్పిపోయిన ఇద్దరు యువకుల కోసం వెతుకుతున్న పోలీసులకు ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. ఈ ఘటన అమెరికాలోని ఓక్లహోమా రాష్ట్రంలో వెలుగు చూసిందని యుఎస్ మీడియా నివేదించింది.
అయితే, ఆ మృతదేహాలు ఎవరివి అనేది ఇంకా గుర్తించలేదు. ఈ ఏడు మృతదేహాల్లోనూ తప్పిపోయిన 14 ఏళ్లు, 16 ఏళ్ల బాలికలు ఉన్నారో లేదో కూడా అధికారులు వెల్లడించలేదు. బాలికలు తప్పిపోవడానికి ముందు దోషిగా తేలిన లైంగిక నేరస్థుడితో కనిపించారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.
దిగొచ్చిన ఉక్రెయిన్.. కాళీ మాత ట్వీట్ కు క్షమాపణ.. భారతీయ సంస్కృతిని గౌరవిస్తామంటూ వ్యాఖ్యలు
హెన్రియెట్టా నగరంలో ఏడు మృతదేహాలు లభ్యమైన తర్వాత అధికారులు టీనేజర్స్ కోసం వెతుకులాట ఆపేశారని ఓక్ముల్గీ కౌంటీ షెరీఫ్ ఎడ్డీ రైస్ తెలిపారు. ‘ఈ ఉదయం మేము వెతుకుతున్నది కనిపించిందని నమ్ముతున్నాం’ అని రైస్ తెలిపారు. ఈ మిస్సింగ్ కేసును హత్యగా పరిశోధిస్తున్నట్లు తెలిపారు. దొరికిన ఏడు మృతదేహాలలో రెండు తప్పిపోయిన బాలికలవని అధికారులు విశ్వసిస్తున్నట్లు రైస్ తెలిపినట్లు మరో వార్తా సంస్థ నివేదించింది.
వార్తల ప్రకారం.. ఈ ఏడు మృత దేహాలు.. లైంగిక నేరస్థుడు, అనేక నేరాల్లో దోషిగా నిర్ధారించబడిన రేపిస్ట్ జెస్సీ ఎల్ మెక్ఫాడెన్ కు సంబంధించిన ప్రదేశంలో దొరికాయి. పోలీసులు వెతుకుతున్న ఇద్దరు బాలికలు చివరిసారిగా సోమవారం తెల్లవారుజామున 1:22 గం.లకు హెన్రియెట్టాలో కనిపించారని, ఇద్దరూ మెక్ఫాడెన్ (39)తో కలిసి తెల్లటి చేవ్రొలెట్ అవలాంచ్లో ప్రయాణిస్తున్నారని స్టేట్ హైవే పెట్రోలింగ్ తప్పిపోయిన వ్యక్తుల గురించి నోటీసును జారీ చేసింది.
"పిల్లలతో అశ్లీలంగా ప్రవర్తించడం, అతని లైంగిక ప్రవర్తన లేదా సాంకేతికత ద్వారా మైనర్తో కమ్యూనికేషన్ను ఏర్పాటు చేసుకోవడం" వంటి అనేక ఆరోపణలు అతని మీద ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మెక్ఫాడెన్ సోమవారం ముస్కోగీ కౌంటీలో విచారణకు హాజరు కావలసి ఉంది. సోమవారం ఉదయం మెక్ఫాడెన్ కోర్టుకు హాజరుకాకపోవడంతో అతని అరెస్టుకు వారెంట్ జారీ చేయబడింది.