Russia Ukraine Crisis: ఉక్రెయిన్-ర‌ష్యా యుద్ధం.. భార‌త్ సాయం కోరిన నేపాల్‌.. ఒకే చెప్పిన కేంద్రం !

Published : Mar 03, 2022, 02:52 PM IST
Russia Ukraine Crisis: ఉక్రెయిన్-ర‌ష్యా యుద్ధం.. భార‌త్ సాయం కోరిన నేపాల్‌.. ఒకే చెప్పిన కేంద్రం !

సారాంశం

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు నెమ్మ‌దిగా ముందుకు సాగుతున్న ర‌ష్యా బ‌ల‌గాలు.. పుతిన్ ఆదేశాల‌తో మ‌రింత దూకుడుగా ముందుకుసాగుతూ.. విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే నేపాల్.. భార‌త్ సాయాన్ని కోరింది. అక్క‌డి నుంచి త‌మ పౌరులను కూడా తీసుకురావాల‌ని నేపాల్ కోర‌గా.. భార‌త్ దానికి సానుకూలంగా స్పందించింది.   

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతూనే ఉంది. ఇరు దేశాల మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు జ‌రిగిన అవి స‌ఫ‌లం కాలేదు. ర‌ష్యా మ‌రింత దూకుడుగా ప్ర‌ద‌ర్శిస్తుండ‌టంతో అంత‌ర్జాతీయ స‌మాజం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని ప‌రిష్క‌రించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్ప‌టికీ ర‌ష్యా ఏమాత్రం ప‌ట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప‌లు దేశాల పౌరులు అక్క‌డ చిక్కుకుపోవ‌డంతో చాలా దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. భార‌త్ సైతం అక్క‌డ చిక్కుకుపోయిన మ‌న పౌరులను తీసుకురావ‌డానికి ప్ర‌త్యేక విమానాలు రంగంలోకి దింపి... ఆప‌రేష‌న్ గంగాను నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే వేల మంది భార‌త పౌరుల‌ను తీసుకువ‌చ్చింది. 

ఆప‌రేష‌న్ గంగాలో భాగంగా భార‌త పౌరులను స్లోవేకియా, పోలాండ్‌, హంగేరీ, రొమేనియా ద్వారా స్వ‌దేశానికి త‌ర‌లిస్తోంది కేంద్ర ప్ర‌భుత్వం. ఈ క్ర‌మంలోనే నేపాల్ భార‌త్ ప్ర‌భుత్వ సాయం కోరింది. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన త‌మ పౌరుల‌ను తీసుకురావ‌డంలో స‌హాయం చేయాల‌ని భారత ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించింది. ఇక నేపాల్ అభ్య‌ర్థ‌నపై కేంద్ర ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించింది. నేపాల్ పౌరుల‌ను తీసుకురావ‌డంలో స‌హాయం అందిస్తామ‌ని వెల్ల‌డించింది. ఫిబ్రవరి 28న, ఉక్రెయిన్ సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో, UNలోని భారత రాయబారి TS తిరుమూర్తి మాట్లాడుతూ.. "మా పొరుగు మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి కూడా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి సహాయం కోరే వారికి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము కూడా అన్ని UN మానవతా ప్రయత్నాలకు మద్దతు ఇవ్వస్తామ‌ని" అన్నారు.  

గతంలో, భారతదేశం కూడా సంక్షోభ సమయాల్లో పొరుగు దేశాల నుండి పౌరులను తరలించింది. కోవిడ్ సంక్షోభం మధ్య, భారతదేశం చైనా నుండి మాల్దీవులు, నేపాల్, బంగ్లాదేశ్ పౌరులను తరలించింది. గత సంవత్సరం, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చేతిలోకి వెళ్లిన‌ప్పుడు.. ఆ దేశం నుండి నేపాలీ జాతీయులను తరలించడానికి భారత్ సాయం అందించింది.  విదేశీ పౌరులను తరలించడానికి భారతదేశం సహాయం చేస్తుందా అనే ప్రశ్నకు సమాధానంగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, "సూత్రప్రాయంగా, ఇతర దేశాలకు సహాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము. మాకు ఏదైనా నిర్దిష్ట అభ్యర్థనలు వస్తే, వారి పట్ల మా వైఖరి మార్గనిర్దేశం చేయబడుతుంది" అని అన్నారు. 

కాగా, ఉక్రెయిన్ పై రష్యా దాడి కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ సుమారు 17,000 మంది భారతీయ పౌరులను ఉక్రెయిన్‌ను నుంచి స్వ‌దేశానికి తీసుకువ‌చ్చింది. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను త‌ర‌లించ‌డానికి కొన‌సాగుతున్న ఆప‌రేష‌న్ గంగా కింద ఇప్ప‌టికే ఆరుకు పైగా విమానాల్లో భార‌త పౌరుల‌ను స్వ‌దేశానికి తీసుకువ‌చ్చారు. ఇప్ప‌టిటి వ‌ర‌కు మొత్తంగా 15 విమానాల్లో భార‌తీయుల‌ను  ఉక్రెయిన్ నుంచి ఇండియాకు త‌ర‌లించారు.  ఈ ఆప‌రేష‌న్ ను ముమ్మ‌రంగా కొన‌సాగించ‌డానికి భార‌త్ ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ ను సైతం రంగంలోకి దింపుతోంది. బుకారెస్ట్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-17 నాల్గవ విమానం ఉక్రెయిన్ నుండి బయలుదేరిన 180 మంది భారతీయ పౌరులతో ఈరోజు తెల్లవారుజామున ఘజియాబాద్‌లోని హిందాన్ ఎయిర్ బేస్‌లో దిగింది. ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మ‌రో మూడు విమానాలు ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల‌కు చేరుకుని భార‌తీయుల‌ను తీసుకురానున్నాయి. వీరితో పాటు మ‌న సాయం కోరుతున్న దేశాల పౌరుల‌ను తీసుకురావ‌డానికి ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే