ఫిలిఫ్పిన్స్‌లో కుప్పకూలిన మిలటరీ విమానం: 45 మంది మృతి

By narsimha lodeFirst Published Jul 4, 2021, 11:28 AM IST
Highlights

పిలిఫ్పిన్స్  మిలటరీ విమానం  కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 45 మంది మరణించారు.

పిలిప్పిన్స్: పిలిఫ్పిన్స్  మిలటరీ విమానం  కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 45 మంది మరణించారు. జోలో దీవిలో మిలిటరీ విమానం క్రాష్ ల్యాండింగ్ అయిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం నుండి 40 మంది సురక్షితంగా బయటపడ్డారు.ఆర్మీ సిబ్బందితో ప్రయాణీస్తున్న విమానం జోలో ద్వీపంలో ల్యాండింగ్ అయ్య సమయంలో కుప్పకూలింది.  పిలిఫ్పిన్స్ కు చెందిన సీ-130 విమానం కుప్పకూలిందని అధికారులు ప్రకటించారు.

ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో ఉగ్రవాదంపై పోరాడే ఉమ్మడి టాస్క్ ఫోర్స్ లో భాగంగా చాలామంది ప్రయాణీకులు ప్రాథమిక సైనిక శిక్షణ పొంది పట్టభద్రులయ్యారు. వీరిని రెసిటివ్ ద్వీపానికి పంపారు.దక్షిణ ఫిలిప్పిన్స్ లో  అబూ సయాఫ్ అనే ఉగ్రవాద గ్రూపులు పనిచేస్తున్నాయి.

click me!