పాకిస్తాన్‌లో దారుణం : యువతిపై 400 మంది మూకుమ్మడి దాడి.. బట్టలు చించి, నగ్నంగా తిప్పిన అల్లరి మూక

By Siva KodatiFirst Published Aug 18, 2021, 6:02 PM IST
Highlights

పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఓ టిక్ టాక్ స్టార్‌ను 400 మంది చుట్టుముట్టి ఆమె బట్టలు చించి నడిబజార్‌లో నగ్నంగా నడిపించారు. అసభ్యంగా తాకుతూ గాల్లోకి విసిరేసి పైశాచికానందం పొందారు. 

పాకిస్థాన్‌లో స్వాతంత్య్ర దినోత్సవం రోజే ఓ యువతిపై దారుణం చోటు చేసుకుంది. టిక్ టాక్ వీడియోలు చేసే ఓ యువతిపై వందలాది మంది మగాళ్లు రాక్షసంగా వ్యవహరించారు. వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లాహోర్ లోని గ్రేటర్ ఇక్బాల్ పార్క్ లో తన ఐదుగురు సహచరులతో కలిసి వీడియో తీస్తున్న టిక్ టాకర్ ను ఓ అల్లరి మూక టార్గెట్ చేసింది

దాదాపు 400 మంది ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. బట్టలు చించేశారు. గాల్లోకి విసిరేసి వికృతానందం పొందారు. అంతేకాదు నడిబజార్ లో ఆ అమ్మాయిని నగ్నంగా నడిపించారు. ఆమె ఒంటిపైనున్న బంగారు ఆభరణాలను, సెల్ ఫోన్‌ను, డబ్బులను దొంగిలించారు.

ఈ ఘటనపై బాధిత యువతి నిన్న లాహోర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అల్లరి మూకల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదని ఆవేదన చెందింది. కొందరు తనను కాపాడే ప్రయత్నం చేసినా.. గుంపు ఎక్కువగా ఉండడంతో కుదరలేదని వాపోయింది. తనను గాల్లోకి ఎగిరేసి, బట్టలు చించేసి పైశాచికానందం పొందారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ బాధాకరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

click me!