మాలిలో బస్ బ్లాస్ట్.. 11 మంది స్పాట్ డెడ్.. 50కి పైగా క్షతగాత్రులు

Published : Oct 14, 2022, 12:30 PM ISTUpdated : Oct 14, 2022, 12:34 PM IST
మాలిలో బస్ బ్లాస్ట్.. 11 మంది స్పాట్ డెడ్.. 50కి పైగా క్షతగాత్రులు

సారాంశం

మాలిలో ఓ బస్ట్ పేలుడు పదార్థాన్ని తాకడంలో పేలి పోయింది. 11 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 53 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.  

న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశం మాలిలో బస్ బ్లాస్ట్ అయింది. ఓ పేలుడు పదార్థాన్ని బస్సు ఢీకొనడంతో ఈ పేలుడు సంభవించింది. ఇందులో 11 మంది అక్కడికక్కడే మరణించారు. కాగా, మరో 53 మంది గాయపడినట్టు ఆస్పత్రి వర్గాలు వివరించాయి. ఈ ఘటన గురువారం సెంట్రల్ మాలిలో చోటుచేసుకుంది.

మోప్తి ఏరియాలో బండియగరా, గౌండకలను కలిపే రోడ్డుపై ఈ దుర్ఘటన జరిగింది. మరణించిన వారంతా సాధారణ పౌరులే. అయితే, ఈ రీజియన్ ఉగ్రవాదులకు అడ్డగా ఉన్నది. ఎక్కువ మంది సాయుధులు ఇక్క తిరుగుతూ ఉంటారు.

Also Read: China Bomb Blast: చైనాలో భారీ పేలుడు.. ఒకరు మృతి.. 42 మందికి తీవ్ర గాయాలు..

దశాబ్దానికి పైగా కాలం నుంచే మాలిలో తిరుగుబాటుదారుల ముప్పును కొలిక్కి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, అవి సఫలం కాలేదు. ఈ రెబల్ గ్రూపులు వేలాది మంది పౌరులను పొట్టనబెట్టుకున్నాయి. మరెందరినో ఇల్లు వదిలిపెట్టి శరణార్థులుగా మార్చి వేసింది. 

ఇక్కడి రెబల్స్ ఎక్కువగా మైన్స్, ఐఈడీలను విధ్వంసానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !