
న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశం మాలిలో బస్ బ్లాస్ట్ అయింది. ఓ పేలుడు పదార్థాన్ని బస్సు ఢీకొనడంతో ఈ పేలుడు సంభవించింది. ఇందులో 11 మంది అక్కడికక్కడే మరణించారు. కాగా, మరో 53 మంది గాయపడినట్టు ఆస్పత్రి వర్గాలు వివరించాయి. ఈ ఘటన గురువారం సెంట్రల్ మాలిలో చోటుచేసుకుంది.
మోప్తి ఏరియాలో బండియగరా, గౌండకలను కలిపే రోడ్డుపై ఈ దుర్ఘటన జరిగింది. మరణించిన వారంతా సాధారణ పౌరులే. అయితే, ఈ రీజియన్ ఉగ్రవాదులకు అడ్డగా ఉన్నది. ఎక్కువ మంది సాయుధులు ఇక్క తిరుగుతూ ఉంటారు.
Also Read: China Bomb Blast: చైనాలో భారీ పేలుడు.. ఒకరు మృతి.. 42 మందికి తీవ్ర గాయాలు..
దశాబ్దానికి పైగా కాలం నుంచే మాలిలో తిరుగుబాటుదారుల ముప్పును కొలిక్కి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, అవి సఫలం కాలేదు. ఈ రెబల్ గ్రూపులు వేలాది మంది పౌరులను పొట్టనబెట్టుకున్నాయి. మరెందరినో ఇల్లు వదిలిపెట్టి శరణార్థులుగా మార్చి వేసింది.
ఇక్కడి రెబల్స్ ఎక్కువగా మైన్స్, ఐఈడీలను విధ్వంసానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.