కామెరూన్ లో విరిగిపడ్డ కొండచరియలు.. 14 మంది దుర్మరణం..

By team teluguFirst Published Nov 28, 2022, 8:58 AM IST
Highlights

కామెరూన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అంత్యక్రియలకు హాజరైన సమయంలో ఇది సంభవించింది. 

కామెరూన్ రాజధాని యౌండేలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 14 మంది మరణించారు. వీరంతా ఓ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైనవారే. ఈ విషయాన్ని స్థానిక గవర్నర్ కామెరూన్ సెంటర్ రీజియన్ గవర్నర్ నసేరి పాల్ బీ ధృవీకరించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే ఆయన అక్కడికి చేరుకున్నారు.

జీఎస్టీ, అవినీతి, నోట్ల రద్దుపై మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడల్లా మైక్‌లు కట్ చేశారు.. : రాహుల్ గాంధీ

ఘటనా స్థలం నుంచి గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం యౌండేలో అంత్యక్రియలకు హాజరైన వారిపై కొండచరియలు విరిగిపడ్డయని, ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారని తెలిపారు. మృతదేహాలను సెంట్రల్ హాస్పిటల్ మార్చురీకి తీసుకుళ్తున్నామని అన్నారు. ఈ ఘటనలో ఇంకా మరణించిన, తప్పిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

Breaking

Many people have died in a landslide in Damas, Yaounde. Developing story. pic.twitter.com/hpPo4NJj5W

— E-KWAT TV (@EkwatTV)

20 మీటర్ల ఎత్తైన కొండచరియలు ఉన్న ప్రాంతంలో అనేక మంది ప్రజలు అంత్యక్రియలకు హాజరయ్యారని, ఇది వారి పైన కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు ‘రాయిటర్స్’ కు తెలిపారు. యౌండే ఆఫ్రికాలోని అత్యంత తేమతో కూడిన నగరాలలో ఒకటి. ఈ ప్రాంతంలో నిటారుగా అనేక కొండచరియలు ఉంటాయి. వాటి కింద గుడిసెలు వేసుకొని ప్రజలు నివసిస్తుంటారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా భారీ వర్షాల సంభవించాయి. దీంతో ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు బలహీనపడ్డాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

Picture and video of a landslide, that happened in Yaoundé today, so sad how some people leave their homes and don’t return🥺🤦🏾. to the departed souls. Pray for pic.twitter.com/cxF4hFMv0Q

— Max🇨🇲 (@ItzMkMax)
click me!