
టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ, X (గతంలో ట్విట్టర్) యజమాని ఎలాన్ మస్క్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో వాషింగ్టన్ డీసీలోని బ్లెయిర్ హౌస్లో భేటీ అయ్యారు. మోదీ రెండు రోజుల అమెరికా పర్యటనలో ఇది ఒక ముఖ్య ఘట్టం. తన ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చిన మస్క్, మోదీ X పోస్ట్కు ప్రతిస్పందిస్తూ ఈ సమావేశాన్ని "గౌరవం ప్రదమైనది" గా అభివర్ణించారు.
టెక్నాలజీ, ఆవిష్కరణలు, ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాలు , అంతరిక్ష రంగాలలో భారతదేశం అభివృద్ధి సహా పలు అంశాలపై వారిద్దరూ చర్చించారు.
టెస్లా కార్యకలాపాలను భారతదేశంలో విస్తరించాలని గట్టిగా భావిస్తున్న మస్క్, దానికి సంబంధించి భారత్ లో ఉన్న అవకాశాలు, పెట్టుబడులకు సంబంధించిన అంవాలపై మోదీతో చర్చించారు.
మస్క్తో సమావేశానికి ముందు, ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్తో ఉన్నారు. ఆయన మొదటి సమావేశం యుఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైఖేల్ వాల్ట్జ్తో జరిగింది.
ఇండో-యుఎస్ వ్యూహాత్మక సహకారంపై దృష్టి సారించిన ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, NSA అజిత్ దోవల్ హాజరయ్యారు.
మోదీ బ్లెయిర్ హౌస్లో కొత్తగా నియమితులైన US డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గాబార్డ్ను కూడా కలిశారు. సమావేశానికి కొన్ని గంటల ముందు గాబార్డ్ అధ్యక్షుడు ట్రంప్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు
ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో కూడా సమావేశం నిర్వహించారు. ఇద్దరు నాయకులు ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. రక్షణతో సహా పలు కీలక రంగాలపై వారు మాట్లాడారు.
అధ్యక్షుడు ట్రంప్ తిరిగి ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా అమెరికా పర్యటన చేస్తున్నారు. ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశం ఇండో-యుఎస్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, వివిధ రంగాలలో సహకార అవకాశాలను అన్వేషిస్తుందని భావిస్తున్నారు.