Social Media: సోషల్ మీడియా ద్వారా రూ. 266 కోట్లు సంపాదించిన జంట.. సంచ‌ల‌న నిర్ణ‌యం

Published : May 06, 2025, 03:59 PM IST
Social Media: సోషల్ మీడియా ద్వారా రూ. 266 కోట్లు సంపాదించిన జంట.. సంచ‌ల‌న నిర్ణ‌యం

సారాంశం

15 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న చైనా ఇన్‌ఫ్లుయెన్సర్ జంట రూ. 266 కోట్లు సంపాదించాక లైవ్ స్ట్రీమింగ్‌కి వీడ్కోలు పలికారు. ఆరోగ్యం, కుటుంబం మీద దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇది చైనా సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.. 

ఐదు సంవత్సరాలుగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న 15 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న జంట లైవ్ స్ట్రీమింగ్‌కి వీడ్కోలు పలికారు. చైనా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న ఈ జంట ఇప్పుడు దూరం కావాలనుకుంటున్నారు. ఈ వార్త చైనా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

15 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న చైనా ఇన్‌ఫ్లుయెన్సర్ జంట రూ. 266 కోట్లు (230 మిలియన్ యువాన్) సంపాదించాక లైవ్ స్ట్రీమింగ్‌కి వీడ్కోలు పలికారు. 8 గంటల లైవ్ స్ట్రీమింగ్ వల్ల ఆరోగ్యం, కుటుంబం మీద ప్రభావం పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

@caihongfufu అనే డౌయిన్ (చైనా టిక్‌టాక్) ఖాతాతో ఫేమస్ అయిన ఈ జంట 2020లో తమ ప్రేమకథను షేర్ చేసుకున్నారు. ఇన్సూరెన్స్ సేల్స్‌లో పనిచేసేటప్పుడు తమ కథను షేర్ చేసి, సంవత్సరంలో 3 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించారు. దీంతో ఆన్‌లైన్ వ్యాపారం మొదలుపెట్టారు. వీరి రోజువారీ ఆదాయమం సుమారు రూ. 4.6 కోట్లు కావడం విశేషం. 

35 ఏళ్ల సన్ కైహోంగ్, 32 ఏళ్ల గువో బిన్ తమ నలుగురు పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి, ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి లైవ్ స్ట్రీమింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. సన్ కైహోంగ్ వోకల్ కార్డ్స్ సమస్య ఉన్నా చికిత్సకు సమయం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ జంట నిర్ణయం చైనా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Iran Israel War: ఇజ్రాయెల్ ప్ర‌ధాని బ‌తికే ఉన్నారా.? అస‌లేం జ‌రుగుతోంది.?
Tuition Banned: ఆ దేశంలో ప్రైవేట్ ట్యూష‌న్లు నిషేధం.. కార‌ణం ఏంటో తెలుసా.?