తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

Afghanistan embassy : భారత్ లో రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేసిన ఆఫ్ఘనిస్తాన్.. కారణమేంటంటే ?

Sreeharsha Gopagani | Published : Nov 24, 2023 10:04 AM

Afghanistan embassy : ఆఫ్ఘనిస్తాన్ భారత్ లో ఉన్న తన రాయబార కార్యాలయాన్ని (Afghanistan embassy) శాశ్వతంగా మూసివేసింది. ఈ విషయాన్ని ఆ రాయబార కార్యాలయం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఇంత కాలం భారత్ అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. 

భారత్ లోని న్యూఢిల్లీ ఉన్న తమ రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత ప్రభుత్వం నుంచి ఎడతెగని సవాళ్ల కారణంగా 2023 నవంబర్ 23 నుంచి ఆఫీసును మూసివేస్తున్నట్టు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30న రాయబార కార్యాలయం కార్యకలాపాలను ఆఫ్ఘనిస్తాన్ నిలిపివేసింది. 

గత రెండు సంవత్సరాల మూడు నెలలుగా భారతదేశంలో ఆఫ్ఘన్ కమ్యూనిటీలో గణనీయమైన క్షీణత కనిపించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆఫ్ఘన్ శరణార్థులు, విద్యార్థులు,  వ్యాపారులు దేశం విడిచి వెళ్లిపోయారని రాయబార కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది, ఆగస్టు 2021 నుండి ఈ సంఖ్య దాదాపు సగానికి పడిపోయిందని పేర్కొంది. ఈ కాలంలో చాలా పరిమితమైన కొత్త వీసాలు జారీ అయ్యాయని తెలిపింది. 

తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించని భారత్ 
న్యూఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయాన్ని భారత అధికారుల అనుమతితో పదవీచ్యుత ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ గత ప్రభుత్వం నియమించిన సిబ్బంది నడుపుతున్నారు. 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ లో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు. రెండేళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ఉపసంహరణకు ముందు కాబూల్ నుంచి తన సొంత సిబ్బందిని ఖాళీ చేయించింది.

ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ ప్రకారం.. భారతదేశంలో నమోదైన దాదాపు 40,000 మంది శరణార్థులలో ఆఫ్ఘన్లు మూడింట ఒక వంతు ఉన్నారు. కానీ ఆ సంఖ్య యూఎన్ వో నమోదు కాని వారిని మినహాయించింది. గత ఏడాది గోధుమలు, మందులు, కోవిడ్-19 వ్యాక్సిన్లతో సహా సహాయ సామగ్రిని కూడా భారత్ పంపింది.

కాగా.. ప్రస్తుతం భారత్ లో ఆఫ్ఘన్ రిపబ్లిక్ కు చెందిన దౌత్యవేత్తలు లేరు. దేశ రాజధానిలో పనిచేసిన వారు సురక్షితంగా మూడవ దేశాలకు చేరుకున్నారని రాయబార కార్యాలయం తన విడుదల ద్వారా తెలియజేసింది, భారతదేశంలో ఉన్న వ్యక్తులు తాలిబాన్లకు అనుబంధంగా ఉన్న దౌత్యవేత్తలు మాత్రమే. వారు రెగ్యులర్ ఆన్ లైన్ సమావేశాలకు హాజరవుతుంటారు. 

అయితే ఆఫ్ఘన్ రిపబ్లిక్ దౌత్యవేత్తలు ఈ మిషన్ ను పూర్తిగా భారత ప్రభుత్వానికి అప్పగించారు. తాలిబన్ దౌత్యవేత్తలకు అప్పగించే అవకాశంతో సహా ఈ మిషన్ మూసివేతను కొనసాగించాలా లేదా ప్రత్యామ్నాయాలను పరిగణించాలా అనే విషయాన్ని నిర్ణయించాల్సిన బాధ్యత ఇప్పుడు భారత ప్రభుత్వంపై ఉంది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ నియమించిన దౌత్యవేత్తల బాధ్యత అధికారికంగా ముగిసింది. 

Read more Articles on
click me!