బాబోయ్.. 72 ఏళ్ల వృద్ధుడిమీద 40 మొసళ్లు దాడి.. ముక్కలు ముక్కలుగా చిధ్రం చేసి...

By SumaBala BukkaFirst Published May 26, 2023, 3:12 PM IST
Highlights

ఓ మొసలిని గుడ్లు పెట్టిన బోనులోంచి బయటకు తీయడానికి ప్రయత్నిస్తుండగా, అతని చేతిలోని కర్రను పట్టుకుని లాగడంతో.. మొసళ్ల మధ్యలో పడిపోయాడు ఓ వృద్ధుడు. 

కంబోడియా : కంబోడియాకు చెందిన ఓ వ్యక్తి మీద 40 మొసళ్లు దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అతని శరీరం ముక్కలు ముక్కలు అయ్యింది. తమ కుటుంబానికి చెందిన మొసళ్ల ఫాంలో అతనికి 40 మొసళ్లు ఉన్నాయి. ఓ మొసలి తాజాగా గుడ్లు పెట్టింది. వాటిని తీయడం కోసం అతను దాన్ని పక్కకు జరపడానికి కర్రతో ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. 

ఈ ఘటన శుక్రవారం జరిగింది. 72 ఏళ్ల వృద్ధుడు గుడ్లు పెట్టిన బోనులోంచి మొసలిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తుండగా, అతను గోడ్‌గా ఉపయోగిస్తున్న కర్రను ఆ మొసరి పట్టుకుని లోపలికి లాగింది. దీంతో పట్టుతప్పి మొసళ్ల ఫాంలో పడిపోయాడు. దాదాపు 40 మొసళ్లు ఆ వ్యక్తి మీద దాడిచేసి, చంపాయని పోలీసులు తెలిపారు.

సహాయం కోసం 911కి కాల్ చేసిన 11 ఏళ్ల బాలుడు.. ఇంటికొచ్చి కాల్పులు జరిపిన పోలీస్...

మొసళ్లు అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేయడంతో... సీమ్ రీప్‌లోని ఆ మొసళ్ల ఫాం కాంక్రీట్ ఆవరణ మొత్తం రక్తంతో నిండిపోయింది.  "అతను గుడ్డు పెట్టే పంజరం నుండి మొసలిని వెంబడిస్తున్నప్పుడు, మొసలి కర్రపై దాడి చేసింది, దీంతో అతను ఎన్‌క్లోజర్‌లో పడిపోయాడు" అని సీమ్ రీప్ కమ్యూన్ పోలీసు చీఫ్ మే సావ్రీ చెప్పారు.

"దీంతో ఇతర మొసళ్ళు మూకుమ్మడిగా అతని మీద దూకాయి, అతను చనిపోయే వరకు అతనిపై దాడి చేశాయి" అని  చెప్పారు. అతని శరీరం మొత్తం మొసలి పంటి గాట్ల గుర్తులతో నిండిపోయింది. అతని ఒక చేయి మొసళ్లు కొరికి మింగాయి.. అని ఆయన తెలిపారు.

2019లో అదే గ్రామంలోని తన కుటుంబానికి చెందిన మొసళ్ల ఫాంలో తిరుగుతున్న రెండేళ్ల బాలికను మొసళ్లు చంపి తిన్నాయని పోలీసు చీఫ్ తెలిపారు. సియెమ్ రీప్ చుట్టూ అనేక మొసళ్ల ఫాంలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో తరాలుగా మొసళ్లను పెంచుతుంటారు. వాటి గుడ్లు, తోలు.. మాంసం కోసం.. మొసలి పిల్లల కోసం వీటిని ఫాంలలో పెంచుతారు. 

click me!