మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. మెక్సికో నగరాన్ని ప్యూబ్లా (Puebla) నగరంతో కలిపే హైవే పై జరిగిన ఘోర ప్రమాదంలో 19 మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. మెక్సికో నగరాన్ని ప్యూబ్లా (Puebla) నగరంతో కలిపే హైవే పై జరిగిన ఘోర ప్రమాదంలో 19 మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ మేరకు స్థానిక అధికారులు వివరాలు వెల్లడించారు. టోల్ బూత్ వద్ద ఉన్న వాహనాలపైకి.. ఓ భారీ ట్రక్ దూసుకొచ్చింది. బ్రేక్లు పనిచేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వాహనాలను ట్రక్కు ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగడంతో.. పలు వాహనాలు దగ్దమయ్యాయి.
Also read: ఆయిల్ ట్యాంకర్ పేలి 92 మంది దుర్మరణం.. మరో 30 మంది పరిస్థితి విషమం
"టోల్ బూత్ను దాటుతున్నప్పుడు, ట్రక్ ఆరు వాహనాలను ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. మరణించిన వారిలో ట్రక్కు డ్రైవర్ కూడా ఉన్నారు" అని ఆ దేశ ఫెడరల్ హైవే అథారిటీ, CAPUFE శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్టుగా అధికారులు వెల్లడించారు.
Also read: ఇరాక్ ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి.. హత్యాయత్నంగా పేర్కొన్న మిలటరీ..
ఈ ప్రమాదంలో దగ్దమైన వాహనాలను అక్కడి నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టినట్టుగా అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన భాగం వరకు ట్రాఫిక్ను అనుమతించడం లేదని చెప్పారు. కాగా, ఈ హైవేపై ఎక్కువగా భారీ ట్రక్కులు రాకపోకలు సాగిస్తాయని అధికారులు చెప్పారు.