కొడంగల్ నియోజకవర్గంలో ఇవాళ టెన్షన్ వాతావారణం నెలకొంది. నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంత్రులు పట్నం మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ఱారావు లు నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నాడు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా ఈ కార్యక్రమాలకు హాజరవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.