నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు బాల త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నుండే భక్తులు క్యూలైన్ల లో నిలబడి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఇంద్ర కీలాద్రి మొత్తం అమ్మవారి నామ స్మరణ తో మారుమోగుతోంది. అమ్మవారికి కుంకుమార్చనలతో పలువురు భక్తులు ప్రత్యేక పూజలు ఆచరిస్తున్నారు.