ట్విట్టర్ లోకి ప్రథమ పౌరుడు

Published : Jul 25, 2017, 01:20 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
ట్విట్టర్ లోకి ప్రథమ పౌరుడు

సారాంశం

ట్విట్టర్ లో రామ్ నాథ్ కోవింద్ 3.25మిలియన్ ఫాలోవర్లు

మన దేశ ప్రథమ పౌరుడు ఈ రోజు ట్విట్టర్ లోకి అడుగుపెట్టారు. రామ్ నాథ్  కోవింద్ భారత 14వ రాష్ట్రపతిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కాగా..ఆయన ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రాష్ట్రపతిగా ఆయన పేరిట రాష్ట్రపతి భవన్ అధికారిక ట్విట్టర్ ఖాతను తెరిచింది. ఈ ఖాతా తెరిచిన కొద్ది సమయానికే 3.25మిలియన్ల మంది  ఫాలోవర్లుగా మారారు. 

‘భారతదేశానికి 14వ రాష్ట్రపతిగా ప్రమాణం చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నా బాధ్యతల్ని వినయ విధేయతలతో నిర్వహిస్తాను.’ అని ఆయన తన తొలి ట్వీట్‌లో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)