తమిళనాడులో రాజకీయ పార్టీల మద్య మాటల యుద్దం కాస్తా దాడుల వరకు వెళ్లింది. ఇటీవల పెరియార్ విగ్రహ ద్వంసానికి బిజెపి పార్టీయే కారణమంటూ బిజెపి కోయంబత్తూరు జిల్లా కేంద్ర కార్యాలయంపై కొందరు వ్యక్తులు బాంబులతో దాడికి దిగారు. ఈ ఘటనతో మరోసారి తమిళనాట అలజడి రేగింది.
ఈ దాడికి సంబందించిన వివరాలిలా ఉన్నాయి. కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయం దగ్గరకు ఇద్దరు యువకులు బైక్ లో వచ్చారు. కార్యాలయం ముందు ఆగి తమవెంట తీసుకువచ్చిన పెట్రోల్ బాంబును బీజేపీ కార్యాలయం మీదకు విసిరి అక్కడి నుంచి పరారైనారు. ఈ దృశ్యాలన్నీ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే ఈ దాడికి పాల్పడ్డ తంతి పెరియార్ ద్రావిడ కలగం (టీపీడీకే)కు చెందిన బాలు అనే యువకుడు బుధవారం కోయంబత్తూరు పోలీసుల ముందు లొంగిపోయాడు.
ఈ దాడితో తమిళనాడులో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య హింస చేలరేగే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న పెరియార్ విగ్రహాలకు, బీజేపీ కార్యాలయాల దగ్గర పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
Coimbatore: A petrol bomb was hurled at BJP office earlier today #TamilNadu pic.twitter.com/hl3WRO0aB7
— ANI (@ANI)