రంగారెడ్డి శంషాబాద్ మండలం నర్కుడలో జరిగుతున్న వ్యవసాయ అధికారుల స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రికెట్ ఆడుతూ బ్యాటింగ్ తో రెచ్చిపోయారు. బౌలర్ వేసిన బంతిని ప్రొపెషనల్ క్రికెటర్ మాదిరిగి బౌండ్రీకి తరలించారు. ఆయన ఆట చూసిన అక్కడున్నవారు యువకులను ఏమాత్రం తీసిపోకుండా మంత్రి బ్యాటింగ్ చేశారని ప్రశంసించారు.
ఈ స్పోర్ట్స్ మీట్ వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తోపాటు పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.