కుప్పకూలిన భారత వైమానిక దళ హెలికాప్టర్

Published : Oct 06, 2017, 12:19 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
కుప్పకూలిన భారత వైమానిక దళ హెలికాప్టర్

సారాంశం

కుప్పకూలిన వైమానిక దళ హెలికాప్టర్ ప్రమాదంలో ఐదుగురి మృతి విచారణకు ఆదేశించిన ఐఏఎఫ్ అధికారులు

భారత వైమానిక దళానికి చెందిన ఓ ట్రైనీ  హెలికాప్టర్ కుప్పకూలి ఐదుగురు వ్యక్తులు మరణించారు. వివరాల్లోకి వెళితే అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ వద్ద పైలట్లకు శిక్షణ ఇచ్చే విమానం ఒకటి సాంకేతిక లోపంతో కుప్పకూలింది. ఈ దుర్ఘటన జరిగినపుడు విమానంలో ఏడుగురు వ్యక్తులు ఉండగా అందులో ఐదుగురు మరణించగా, ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవాళ ఉదయం ఎయిర్ మెయింటెనెన్స్ మిషన్ నిర్వహిస్తుండగా హఠాత్తుగా ఈ ప్రమాదం సంభవించింది. ఇందులో ఉన్నవారు తప్పించుకునే సమయం లేకుండా రెప్పపాటులో ప్రమాదం జరిగింది. ఇండో చైనా సరిహద్దులో జరిగిన ఈ ప్రమాద విషయం తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే స్పందించి గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 
ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు వైమానిక దళ అధికారులు తెలిపారు. ఈ మద్య కాలంలో వైమానిక హెలికాప్టర్ లు  ప్రమాదానికి గురవుతుండటంతో వీటిపై సీరియస్ గా విచారణ జరిపించనున్నట్లు ఐఏఎప్ అధికారులు ఉన్నతాధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)