ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాచైతన్య యాత్రకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాత్రను విజయవంతం చేసేందుకు పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా కృషి చేస్తున్నారు. ఇందులో బాగంగా యాత్రకు ప్రచారం కల్పించేందుకు రూపొందించిన పాటలను బస్సుయాత్రలో మీడియా కమిటీ ఛైర్మన్ గా బాద్యతలు నిర్వహిస్తున్న మల్లు రవి విడుదల చేశారు. ఈ పాటలను ఏపూరి సోమన్న పాడి వినిపించారు. ఆ దుమ్మురేగే పాటలను మనమూ విందామా.