తెనాలి బార్ లో దారుణ హత్య: వ్యక్తిని చంపి పరార్

Published : Oct 24, 2020, 08:17 AM ISTUpdated : Oct 24, 2020, 08:18 AM IST
తెనాలి బార్ లో దారుణ హత్య: వ్యక్తిని చంపి పరార్

సారాంశం

గుంటూరు జిల్లా తెనాలిలోని బార్ అండ్ రెస్టారెంట్ లో దారుణమైన హత్య జరిగింది. సుబానీ అనే వ్యక్తిని రఫీ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు.

గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ హత్య జరిగింది. గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో ఓ వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. 

శుక్రవారం రాత్రి సుభానీ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి నందుపేటలోని బార్ అండ్ రెస్టారెంట్ కు మద్యం సేవించడానికి వెళ్లాడు. అక్కడికి షేక్ రఫీ అనే వ్యక్తి వచ్చాడు సుభానీకి, రఫీకి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో రఫీ సుభానీని కత్తితో పొడిచాడు. విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో సుభానీ అక్కడికక్కడే మరణించాడు. 

హత్య చేసిన తర్వాత షేక్ రఫీ అక్కడి నుంచి పరారయ్యాడు. షేక్ రఫీని ఆపే ప్రయత్నం బార్ లో ఏ ఒక్కరు కూడా చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఘటన జరిగిన వెంటనే సుభానీతో పాటు వచ్చిన ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యాడు. 

మద్యం మత్తులో ఈ ఘటన జరిగిందని అంటున్నారు. అయితే, పథకం ప్రకారమే రఫీ సుభానీని హత్య చేయడానికి వచ్చాడనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా