పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు... ఏటీఎంలో నగదు నింపే వాహనంలోంచి 36లక్షల చోరీ

Arun Kumar P   | Asianet News
Published : Jun 09, 2020, 07:05 PM ISTUpdated : Jun 09, 2020, 07:12 PM IST
పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు... ఏటీఎంలో నగదు నింపే వాహనంలోంచి 36లక్షల చోరీ

సారాంశం

గుంటూరు జిల్లాలో పట్టపగలే భారీ  దొంగతనం చోటుచేసుకుంది. 

అమరావతి: గుంటూరు జిల్లాలో పట్టపగలే భారీ  దొంగతనం చోటుచేసుకుంది. సినీ పక్కీలో ఏటిఎంలో నగదును నింపే వాహనంలో నుండి దాదాపు 36లక్షలను అత్యంత చాకచక్యంగా దోపిడీ చేశారు దుండగులు. ఈ చోరీ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

ఈ దోపిడీకి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు పట్టణ సమీపంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన గల ఏటిఎంలో నగదు నిల్వ చేయడానికి వచ్చిన వాహనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యాన్లో ఉన్న నలుగురు సిబ్బంది ఏటిఎం లోకి వెళ్లటంతో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన దొంగలు వాహనంలోని డబ్బును తీసుకుని పరారయ్యారు. వారు దొంగిలించిన నగదు దాదాపు  36లక్షలు వుంటుందని సమాచారం. 

read more  విజయవాడ గ్యాంగ్‌వార్: పనిచేయని పండూ చేతివేలు, న్యూరో జర్జరీ విభాగంలో పరీక్షలు

ఈ దోపిడీపై వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి దొంగలను పట్టుకోవాలని నల్లపాడు పోలీసులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దోపిడీకి పాల్పడిన  దుండగులు వ్యాన్లో ఉన్న నలుగురు సిబ్బందిలో ఎవరో ఒకరికి సంబందించిన వ్యక్తులు అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా