బాలీవుడ్ లో సౌత్ ఫ్లేవర్.. అదరగొడుతున్న బ్యూటీలు..!

First Published Jun 28, 2021, 12:00 PM IST

ఆ సినిమాల్లోకి కూడా ఎక్కువగా సౌత్ బ్యూటీలనే ఎంపిక చేసుకుంటున్నారు. అభిషేక్ బచ్చన్ తన బ్రీత్ వెబ్ సిరీస్ కోసం నిత్యా మేనన్ ని తీసుకున్న తర్వాత.. చాలా మంది సౌత్ బ్యూటీలను ఎంపిక చేయడానికి బాలీవుడ్ వాళ్లు ఆసక్తి  చూపిస్తున్నారు.
 

హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారంతా... బాలీవుడ్ లో ఒక్క సినిమాలో అయినా నటించాలని ఆరాటపడుతుంటారు. ఇక ఆడియన్స్ కూడా.. ఎప్పుడూ చూసే హీరోయిన్స్ కాకుండా.. కొత్త అందాలను చూడాలని కోరుకుంటారు. ఈ క్రమంలో... బాలీవుడ్ పై దక్షిణాది తారలు కన్నేశారు.
undefined
ఛాన్స్ ల కోసం ఎదురు చూడటం కాదు.. అవకాశాల మీద అవకాశాలు దక్కించుకుంటున్నారు. దక్షిణాదిన టాప్ హీరోయిన్లుగా దూసుకెళ్లినవారంతా ఇప్పుడు బాలీవుడ్ లో వరస అవకాశాలు దక్కించుకుంటున్నారు. అది కూడా వెబ్ సిరీస్ ల కోసం కావడం గమనార్హం. మరి.. బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోబోతున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
undefined
సమంత అక్కినేని, రష్మిక మందాన, ప్రణీత సుభాష్, రాశీ ఖన్నా, నిత్యా మేనన్ వీరంతా ఇప్పుడు.. బాలీవుడ్ లో వరస ఛాన్స్ దక్కించుకుంటున్నారు. గతంలో బాలీవుడ్ సినిమాలు.. టాలీవుడ్ లో రిమేక్ చేసేవారు.. ఇప్పుడు టాలీవుడ్ లోని సినిమాలు.. బాలీవుడ్ లో వరస రిమేక్ చేస్తున్నారు.
undefined
కాగా.. ఆ సినిమాల్లోకి కూడా ఎక్కువగా సౌత్ బ్యూటీలనే ఎంపిక చేసుకుంటున్నారు. అభిషేక్ బచ్చన్ తన బ్రీత్ వెబ్ సిరీస్ కోసం నిత్యా మేనన్ ని తీసుకున్న తర్వాత.. చాలా మంది సౌత్ బ్యూటీలను ఎంపిక చేయడానికి బాలీవుడ్ వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారు.
undefined
ఇక రష్మిక మందన్నా.. బ్యాక్ టూ బ్యాక్ రెండు హిందీ చిత్రాల్లో నటంచేందుకు సంతకం చేసింది. మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాల్లో రష్మిక కనపడనుంది. కాగా.. ఇక ప్రణీత సుభాష్.. ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, హంగామా2 చిత్రాల్లో నటించనుంది.
undefined
రాశీఖన్నా.. షాహిద్ కపూర్ తో కలిసి నటించనుంది. ఇక సమంత.. ఫ్యామిలీ మ్యాన్ 2లో నటించి అందరి ప్రశంసలు అందుకుంది.
undefined
బహుబలి సినిమా విజయం తర్వాత.. టాలీవుడ్ పై బాలీవుడ్ నిర్మాతల కన్ను పడింది. ఈ క్రమంలోనే... ఇక్కడి తారలను అక్కడి సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఓటీటీల ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. వాటిల్లోనే సినిమాలు, వెబ్ సిరీస్ లను విడుదల చేస్తున్నారు. వాటిల్లోకి ఈ దక్షిణాది తారలు ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు.
undefined
షాహిద్ కపూర్ తో కలిసి నటించడంపై రాశీఖన్నా స్పందించారు. ‘‘ అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు నటులు మారడాన్ని ప్రేక్షకులు చాలా ఓపెన్ గా ఉన్నారు. చాలా మంది బాలీవుడ్ నటులు దక్షిణాది సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నాకు అక్కడ నటించే అవకాశం దక్కింది. దీనిని భారతీయ చిత్ర పరిశ్రమ అనే కదా పిలుస్తున్నాం. గతంలో కంటే.. నటులకు, దర్శక నిర్మాతలకు ఇప్పుడు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి’ అని రాశీఖన్నా పేర్కొన్నారు.
undefined
ఇక హిందీ చిత్రాల్లో వరస అవకాశాలు దక్కించుకున్న రష్మిక మాట్లాడుతూ... తనకు ప్రయోగాలు చేయడం ఎక్కువ ఇష్టమని చెప్పింది. బాలీవుడ్ లో ప్రేక్షకులు తనను ఎలా ఆదరిస్తారనే విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు రష్మిక పేర్కొంది.
undefined
డియర్ కామ్రేడ్ లో రష్మిక నటన చూసి ఇంప్రెస్ అయ్యి.. తమ సినిమాలో అవకాశం ఇచ్చినట్లు ఫిల్మ్ మేకర్ శతాన్షు పేర్కొన్నారు.
undefined
ఇక సమంత.. రంగస్థలం, సూపర్ డీలక్స్ లో నటన చూసి.. ఫ్యామిలీ మెన్ 2 లో రాజీ క్యారెక్టర్ ఇచ్చినట్లు రాజ్, డీకేలు చెప్పారు. సమంత నటించిన తొలి ఓటీటీ, హిందీ లో నటించడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం.
undefined
click me!