విరాట్- అనుష్కలకు పుట్టబోయేది అమ్మాయేనట!

First Published Sep 3, 2020, 12:36 PM IST

ఇదే విషయమై ఇటీవల కోహ్లీ ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించాడు. ఈ న్యూస్ వినగానే తాను మేఘాల్లో తేలిపోయానని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ లాక్ డౌన్ సమయంలో తాను తన భార్య అనుష్కతో ఎలా గడిపాననే విషయాన్ని కూడా కోహ్లీ మీడియాతో పంచుకున్నాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ దివా అనుష్క శర్మ లు ఇటీవల అభిమానులను శుభవార్త తెలియజేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే తాము ముగ్గురం కాబోతున్నామంటూ విరుష్క జోడి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
undefined
గత వారం ఈ శుభవార్త ప్రకటించిన ఈ జోడి.. తమ జీవితంలోకి మరో చిన్నారి అడుగుపెట్టబోతోందని.. 2021 జనవరిలో డెలివరీ ఉంటుందని విరుష్క జోడి పేర్కొన్నారు.
undefined
శుభవార్త ప్రకటించిన తర్వాత.. ఈ దంపతులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కలిసి సంబరాలు కూడా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.
undefined
ఇదే విషయమై ఇటీవల కోహ్లీ ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించాడు. ఈ న్యూస్ వినగానే తాను మేఘాల్లో తేలిపోయానని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ లాక్ డౌన్ సమయంలో తాను తన భార్య అనుష్కతో ఎలా గడిపాననే విషయాన్ని కూడా కోహ్లీ మీడియాతో పంచుకున్నాడు.
undefined
‘ అదో అనిర్వచనీయమైన అనుభూతి. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఆ వార్త తెలిశాక మేము మేఘాల్లో తేలిపోయాం’ అంటూ కోహ్లీ పేర్కొన్నాడు. ఈ న్యూస్ ని అందరితో పంచుకున్న తర్వాత అభిమానులు చూపించిన ప్రేమ వెలకట్టలేనిదన్నాడు. తమ మధ్యలోకి మూడో వ్యక్తి రాక కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు.
undefined
కాగా.. అయితే.. వీరి జీవితంలోకి రాబోయే చిన్నారిపై అభిమానులు ఇప్పటికే ఉత్సాహం చూపిస్తున్నారు. అమ్మాయి పుడుతుందా..? అబ్బాయి పుడతాడా తెలుసుకోవాలని ఉత్సాహపడుతున్నారు.
undefined
ఈ క్రమంలో ఓ ప్రముఖ జ్యోతిష్యుడు.. వారి జాతకం ప్రకారం ఎవరు పుడతారో చెప్పేశారు. వారి జాతకం ప్రకారం.. అమ్మాయి పుట్టే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
undefined
అమ్మాయి పుట్టినా.. అబ్బాయి పుట్టినా.. దేవుడి ప్రసాదంగానే భావించాలని పండితులు చెప్పారు. అయితే.. విరాట్, అనుష్క జోడికి మాత్రం అమ్మాయి పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.
undefined
పండిట్ జగన్నాథ్ తెలిపిన వివరాల ప్రకారాం విరుష్కకు అందమైన ఆడపిల్ల పుడుతుంది. పండిట్ జగన్నాథ్ గురూజీ ఒక ప్రముఖ జ్యోతిష్కుడు, ప్రవక్త. ఆయన గత 25 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్ లో ఉన్నారు.
undefined
ఇదిలా ఉండగా.. కోహ్లీ ప్రస్తుతం.. ఐపీఎల్ 2020 కోసం దుబాయి వెళ్లారు.
undefined
అనుష్క, విరాట్ కోహ్లీలుు 2017లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
undefined
click me!