రాత్రిపూట ఇలాచేస్తే... ముఖం మెరిసిపోతుంది..!

First Published Apr 10, 2021, 1:13 PM IST

రాత్రిపూట కొన్ని ఫేస్ మాస్క్ లు వేసుకుంటే మాత్రం అందంగా మెరిసిపోవచ్చని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. ఈ ఫేస్ ప్యాక్ రాత్రి వేసుకొని.. తెల్లారిన తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

సమ్మర్ వచ్చేసింది. ఈ సమ్మర్ లో ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా ఇట్టే చెమటలు పట్టేస్తాయి. దీంతో ముఖం జిడ్డుగా మారిపోతుంది. అంతేకాదు.. ఒక పది నిమిషాలు ఎండలో నిలబడితే ట్యాన్ వచ్చేసింది.
undefined
ట్యాన్ రావడం చాలా సులువు. కానీ దానిని వదిలించుకోవడం మాత్రం చాలా కష్టం. అయితే... రాత్రిపూట కొన్ని ఫేస్ మాస్క్ లు వేసుకుంటే మాత్రం అందంగా మెరిసిపోవచ్చని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. ఈ ఫేస్ ప్యాక్ రాత్రి వేసుకొని.. తెల్లారిన తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
undefined
1. తేనె, ఓట్ మీల్ ఫేస్ ప్యాక్రెండు స్పూన్ల తేనే, ఓట్ మీల్స్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆ రెండింటిని బాగా కలిపి అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. ఆ మిశ్రమాన్ని రాత్రిపూట ముఖానికి రాసుకోవాలి. దానిని రాత్రంతా అలానే వదిలేసి.. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై డెడ్ సెల్స్ తొలగిపోయి.. ముఖం మెరిసిపోయేలా చేస్తుంది. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి.
undefined
2.పెరుగు, తేనె.ఒక స్పూన్ పెరుగు లో ఒక స్పూన్ తెనె కలిపి ముఖానికి రాసుకోవాలి. రాత్రంతా అలా వదిలేసి.. ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. అలా చేయడం వల్ల ముఖం చాలా తాజాగా కనపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ కూడా తరచూ ఉపయోగించడం వల్ల ముఖం అందంగా కనపడుతుంది.
undefined
3.కీరదోస, ఆలివ్ ఆయిల్..రెండు స్పూన్ల కీరదోస రసంలో.. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మరింత అందంగా కనపిస్తారు. కీరదోసలోని కూలింగ్ ప్రాపర్టీస్ చర్మం మృదువుగా మారేలా సహాయం చేస్తుంది.
undefined
click me!