నైనీ రైల్వే స్టేషన్
ఉత్తరప్రదేశ్లోని నైనీ రైల్వే స్టేషన్ లో కూడా దెయ్యం తిరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ స్టేషన్ ప్లాట్ఫారమ్లపై దెయ్యం ఆకారాన్ని చూశామని స్థానికులు చెబుతారు. గంగా నదికి సమీపంలో ఉన్న ఈ స్టేషన్ కు రావడానికి కూడా ప్రయాణికులు భయపడతారు.
చిత్తూరు రైల్వే స్టేషన్
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు రైల్వే స్టేషన్పై కూడా పలు దెయ్యం కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అక్కడ ట్రాక్పై ఒక మహిళను చంపారని, ఆమె ఆత్మ అక్కడ తిరుగుతుందని స్థానికులు నమ్ముతారు. ప్రయాణికులు, రైల్వే ఉద్యోగులు కూడా తరచుగా రాత్రిపూట మహిళ అరుపులు వింటుంటామని చెబుతారు.
2013లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ పై కొందరు దాడి చేసి చంపేశారు. అప్పటి నుంచి ఆయన ఆత్మ ఆ స్టేషన్ సమీపంలో సంచరిస్తుందని స్థానికులు నమ్ముతారు.
గమనిక: ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో ప్రచారం ఉన్న కథనాలు మాత్రమే. వీటికి ఎలాంటి ఆధారాలు లేవు.