నేడు జరుగుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో గ్యాస్ సిలిండర్ ధరలు కీలకం కానున్నాయి. అక్కడ ప్రచారం అంతా పెరిగిన సిలిండర్ల చుట్టూ సాగడం, ఓటు వేయడానికి వెళ్లే ముందు సిలిండర్లకు మొక్కి, టీఆర్ఎస్ కు ఓటు వేయాలంటూ ప్రచారం చేయడంతో.. అది పార్టీ గుర్తు కావచ్చనే గందరగోళమూ నెలకొంది.
హుజురాబాద్లో పోలింగ్ కి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్లయ్యి.. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యింది. పోలింగ్ సాయంత్రం ఏడు గంటల వరకు జరుగుతుంది. హుజురాబాద్ నియోజకవర్గం లో 306 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసారు.. నియోజకవర్గం లోని ఐదు మండలాలలో మొత్తం 2,37,036 ఓటర్లు ఉండగా, పురుషులు 1,17,933, కాగా స్త్రీలు 1,19,102 ఉన్నారు. ఇతరులు ఒక్క ఓటరు ఉన్నారు.