దుబ్బాక ఫలితం రీపీటయ్యేనా?: టీఆర్ఎస్,కాంగ్రెస్‌లకు బీజేపీ చెక్ పెట్టేనా?

Published : Apr 12, 2021, 06:33 PM IST

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం కోసం మూడుప్రధాన పార్టీలు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

PREV
116
దుబ్బాక ఫలితం రీపీటయ్యేనా?: టీఆర్ఎస్,కాంగ్రెస్‌లకు బీజేపీ చెక్ పెట్టేనా?

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీ చెక్ పెడుతోందా, గత ఎన్నికల కంటే మెరుగైన ఓట్లను సాధిస్తోందా లేదా దుబ్బాక తరహాలో అనుహ్య విజయం సాధిస్తోందా అనే చర్చ సర్వత్రా సాగుతోంది.

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీ చెక్ పెడుతోందా, గత ఎన్నికల కంటే మెరుగైన ఓట్లను సాధిస్తోందా లేదా దుబ్బాక తరహాలో అనుహ్య విజయం సాధిస్తోందా అనే చర్చ సర్వత్రా సాగుతోంది.

216

గత ఏడాది డిసెంబర్ మాసంలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి  జరిగిన ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించారు. ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే రఘునందన్ రావు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

గత ఏడాది డిసెంబర్ మాసంలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి  జరిగిన ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించారు. ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే రఘునందన్ రావు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

316

ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతను బరిలోకి దింపింది. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.

ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతను బరిలోకి దింపింది. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.

416

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కూడా తాము అనుహ్య విజయాన్ని సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. అయితే అభ్యర్ధి ఎంపిక విషయమై బీజేపీ చివరి నిమిషం వరకు వేచి చూసింది.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కూడా తాము అనుహ్య విజయాన్ని సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. అయితే అభ్యర్ధి ఎంపిక విషయమై బీజేపీ చివరి నిమిషం వరకు వేచి చూసింది.

516


టీఆర్ఎస్ కు చెందిన ఒక నేతపై బీజేపీ నాయకత్వం ఆశలు పెట్టుకొంది. టికెట్టు దక్కకపోవడంతో బీజేపీ తీర్థం పుచ్చుకొంటారని ఆ పార్టీ నాయకత్వం ఆశగా ఉంది. అయితే టికెట్టు దక్కపోయినా కేసీఆర్ నుండి వచ్చిన హామీతో ఆ నేత టీఆర్ఎస్ లోనే ఉండిపోయారు. దీంతో బీజేపీ నామినేషన్ల దాఖలుకు చివరి నిమిషంలో అభ్యర్ధిని ప్రకటించింది.


టీఆర్ఎస్ కు చెందిన ఒక నేతపై బీజేపీ నాయకత్వం ఆశలు పెట్టుకొంది. టికెట్టు దక్కకపోవడంతో బీజేపీ తీర్థం పుచ్చుకొంటారని ఆ పార్టీ నాయకత్వం ఆశగా ఉంది. అయితే టికెట్టు దక్కపోయినా కేసీఆర్ నుండి వచ్చిన హామీతో ఆ నేత టీఆర్ఎస్ లోనే ఉండిపోయారు. దీంతో బీజేపీ నామినేషన్ల దాఖలుకు చివరి నిమిషంలో అభ్యర్ధిని ప్రకటించింది.

616


బీజేపీ అభ్యర్ధిగా కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన డాక్టర్ రవికుమార్ నాయక్  బరిలోకి దింపింది. ఈ నియోజకవర్గంలో సుమారు 40 వేలకు పైగా గిరిజన ఓటర్లు ఉన్నారు. గిరిజన ఓట్లు గంపగుత్తగా పడితే రవికుమార్ విజయం నల్లేరుపై నడకేనని ఆ పార్టీ భావిస్తోంది.


బీజేపీ అభ్యర్ధిగా కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన డాక్టర్ రవికుమార్ నాయక్  బరిలోకి దింపింది. ఈ నియోజకవర్గంలో సుమారు 40 వేలకు పైగా గిరిజన ఓటర్లు ఉన్నారు. గిరిజన ఓట్లు గంపగుత్తగా పడితే రవికుమార్ విజయం నల్లేరుపై నడకేనని ఆ పార్టీ భావిస్తోంది.

716

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానంలో యాదవ సామాజిక వర్గం ఓటర్లు గణనీయంగా ఉంటారు. గతంలో రెండు దఫాలు ఈ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధుల ,చేతిలోనే జానారెడ్డి ఓటమి పాలయ్యాడు.

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానంలో యాదవ సామాజిక వర్గం ఓటర్లు గణనీయంగా ఉంటారు. గతంలో రెండు దఫాలు ఈ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధుల ,చేతిలోనే జానారెడ్డి ఓటమి పాలయ్యాడు.

816


గత ఎన్నికల సమయంలో ఈ అసెబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా నివేదిత రెడ్డి పోటీ చేశారు. ఈ దఫా కూడ టికెట్ ఆశించారు. కానీ డాక్టర్ రవికుమార్ నాయక్ కు బీజేపీ సీటిచ్చింది.


గత ఎన్నికల సమయంలో ఈ అసెబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా నివేదిత రెడ్డి పోటీ చేశారు. ఈ దఫా కూడ టికెట్ ఆశించారు. కానీ డాక్టర్ రవికుమార్ నాయక్ కు బీజేపీ సీటిచ్చింది.

916

 ఈ స్థానం నుండి సీటు ఆశించిన కడారి అంజయ్య యాదవ్ కు బీజేపీ మొండిచేయి చూపింది. దీంతో ఆయన రాత్రికి రాత్రే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు. అంజయ్య యాదవ్ 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి 20 వేలకు పైగా ఓట్లు సాధించాడు.

 ఈ స్థానం నుండి సీటు ఆశించిన కడారి అంజయ్య యాదవ్ కు బీజేపీ మొండిచేయి చూపింది. దీంతో ఆయన రాత్రికి రాత్రే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు. అంజయ్య యాదవ్ 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి 20 వేలకు పైగా ఓట్లు సాధించాడు.

1016

ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. పార్టీ నేతల అత్యుత్సాహం కారణంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపాలు కావాల్సి వచ్చిందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు.

ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. పార్టీ నేతల అత్యుత్సాహం కారణంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపాలు కావాల్సి వచ్చిందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు.

1116


బీజేపీ అగ్రనేతలు ఈ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు ఈ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.
 


బీజేపీ అగ్రనేతలు ఈ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు ఈ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.
 

1216


ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను వెనక్కి నెడితే టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని తమను ప్రజలు నమ్ముతున్నారని చెప్పుకొనేందుకు బీజేపీ అవకాశం దక్కనుంది.


ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను వెనక్కి నెడితే టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని తమను ప్రజలు నమ్ముతున్నారని చెప్పుకొనేందుకు బీజేపీ అవకాశం దక్కనుంది.

1316

ఒకవేళ తమకంటే వెనుకపడితే  టీఆర్ఎస్ కు రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ ప్రచారం చేసుకొనే అవకాశం రానుంది.

ఒకవేళ తమకంటే వెనుకపడితే  టీఆర్ఎస్ కు రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ ప్రచారం చేసుకొనే అవకాశం రానుంది.

1416

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ చావో రేవో తేల్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.  దీంతో ఆ పార్టీ నేతలు కూడ ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ చావో రేవో తేల్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.  దీంతో ఆ పార్టీ నేతలు కూడ ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు.

1516

దుబ్బాక తరహలో ఈ నియోజకవర్గంలో బీజేపీకి బలమైన నాయకుడు లేడు. కాంగ్రెస్ నుండి జానారెడ్డి పోటీలో ఉన్నాడు. టీఆర్ఎస్ నుండి నోముల నర్సింహ్మయ్య తనయుడు భగత్ పోటీకి దిగాడు. నర్సింహ్మయ్య కొడుకు పోటీలో ఉన్నందున  సానుభూతి కలిసి వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ నాయత్వం భావిస్తోంది. కానీ బీజేపీ అభ్యర్ధి రవినాయక్ విప్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

దుబ్బాక తరహలో ఈ నియోజకవర్గంలో బీజేపీకి బలమైన నాయకుడు లేడు. కాంగ్రెస్ నుండి జానారెడ్డి పోటీలో ఉన్నాడు. టీఆర్ఎస్ నుండి నోముల నర్సింహ్మయ్య తనయుడు భగత్ పోటీకి దిగాడు. నర్సింహ్మయ్య కొడుకు పోటీలో ఉన్నందున  సానుభూతి కలిసి వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ నాయత్వం భావిస్తోంది. కానీ బీజేపీ అభ్యర్ధి రవినాయక్ విప్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

1616


దుబ్బాక ఉప ఎన్నికతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికను పోల్చలేమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. దుబ్బాకలో రఘునందన్ రావు షెడ్యూల్ కంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ అభ్యర్ధిపై ఆ పార్టీలో ఉన్న అసంతృప్తి, కాంగ్రెస్ కు సరైన నేత లేకపోవడం కలిసి వచ్చింది. 


దుబ్బాక ఉప ఎన్నికతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికను పోల్చలేమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. దుబ్బాకలో రఘునందన్ రావు షెడ్యూల్ కంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ అభ్యర్ధిపై ఆ పార్టీలో ఉన్న అసంతృప్తి, కాంగ్రెస్ కు సరైన నేత లేకపోవడం కలిసి వచ్చింది. 

click me!

Recommended Stories