ఇంతకీ వైఎస్ షర్మిల ఎవరు వదిలిన బాణం?

First Published Feb 9, 2021, 4:58 PM IST

తెలంగాణలో షర్మిల వరుసగా వైఎస్ఆర్ అభిమానులతో సమావేశం కావాాలని నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది. త్వరలోనే ఆమె పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల రాజకీయ పార్టీ పెట్టబోతున్నారన్న అంశంలో క్లారిటీ వచ్చేసింది.తెలంగాణలోని వైఎస్ఆర్ అభిమానులతో ఆమె వరుసగా సమావేశాలు నిర్వహించనుంది.
undefined
మంగళవారం నాడు ఆమె నల్గొండ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నేతలతో షర్మిల సమావేశం నిర్వహించనున్నారు.
undefined
అవసరమైతే జిల్లాల్లో పర్యటించి సమావేశాల్లో షర్మిల పాల్గొనాలని భావిస్తున్నారు. షర్మిల టూర్ షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేయనున్నారు.
undefined
ఇవాళ కాకపోతే రేపు ఆమె పార్టీ పెట్టడం ఖాయంగా కన్పిస్తోంది.అయితే ఇప్పుడు ఆ విషయంపై చర్చ జరగడం లేదు. ఆమె ఎవరు వదిలిన బాణం అన్నఅంశం పైనే చర్చ జరుగుతోంది.
undefined
జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా పార్టీ పెట్టిస్తున్నారా లేకపోతే.. బీజేపీకి చెక్ పెట్టడానికి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారా అనేది తేలాల్సి ఉంది.
undefined
కేసీఆర్‌కు గండి కొట్టడానికి బీజేపీ ఈ స్కెచ్ వేసిందా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి.
undefined
షర్మిల సొంతంగా పార్టీ పెట్టి తెలంగాణ సీఎం అయిపోతుందని మాత్రం ఎవరూ అంచనా వేయడం లేదు.
undefined
ఆంధ్రప్రాంతానికి చెందిన నేత తెలంగాణలో పార్టీ పెట్టాలనే ఆలోచనే అనూహ్యం. ఆ ఆలోచనను షర్మిల చేశారు.
undefined
తెలంగాణలో పార్టీ విషయమై జగన్, షర్మిల మధ్య బిన్నాభిప్రాయాలు ఉన్నాయని వైఎస్ఆర్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అయితే తెలంగాణలో ముందుకు వెళ్లాలని షర్మిల నిర్ణయం తీసుకొన్నారని సజ్జల చెప్పారు.
undefined
తెలంగాణలో మారిపోతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా అర్జంట్‌గా కేసీఆర్ కొత్త వ్యూహాల్ని అమలు చేయాల్సిన పరిస్థితిలో పడ్డారని ఆయనే జగన్మోహన్ రెడ్డితో కలిసి షర్మిలతో కొత్త పార్టీ ప్లాన్ చేశారని ఓ వర్గం అంచనా వేస్తోంది.
undefined
దీనికి రకరకాల సమీకరణాలు చెబుతున్నారు. షర్మిల పార్టీ పెడితే రెడ్డి సామాజికవర్గంతో పాటు కన్వర్టడ్ క్రిస్టియన్, దళితులు మద్దతుగా నిలుస్తారని చెబుతున్నారు.
undefined
ఇలాంటి వారిలోఅత్యధికం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. అయితే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఎన్నికలు జరిగితే వారంతా బీజేపీ వైపు వెళ్తారు.
undefined
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ గట్టిగా పోరాడుతారనే నమ్మకం కలిగిస్తే వారంతా కాంగ్రెస్ తోనే ఉండే అవకాశం ఉందనే వాదన కూడ లేకపోలేదు.
undefined
ఈ పరిస్థితిని నివారించడంతో పాటు ఓట్లు చీల్చడానికి కేసీఆర్ ఈ వ్యూహం పన్నారని అంటున్నారు. మరో వైపు షర్మిలకు బీజేపీ సపోర్ట్ ఉందన్న ప్రచారం కూడా లేకపోలేదు.
undefined
కేసీఆర్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్ పెట్టాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ షర్మిల పార్టీని రంగంలోకి తెచ్చినట్లుగా చెబుతున్నారు. షర్మిల పార్టీ పెడితే ఆ ప్రభావం ఎక్కువగా అధికార పార్టీ పైనే పడుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
undefined
తెలంగాణ సెంటిమెంట్ పూర్తిగా కనుమరుగు అవడంతో పాటు.. అధికార వ్యతిరేకత మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
undefined
షర్మిల ఇప్పటికే అమిత్ షాతో చర్చలు జరిపారని త్వరలో ఆయనతో భేటీ అయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
undefined
ఆమె బీజేపీతో కలిసి నడుస్తుందన్న అంచనాలను ఇప్పటికే ఆ పార్టీలోని ఓ వర్గం ప్రచారం చేయడం ప్రారంభించింది. ఇవేమీ కాదు అసలు జగన్మోహన్ రెడ్డి తన కుటుంబానికి అధికారం కోసం ఇలా చెల్లితో గేమ్ ఆడిస్తున్నారన్న ప్రచారం కూడ లేకపోలేదు. ఈ ప్రచారాన్ని వైసీపీ కొట్టిపారేసింది.
undefined
ఇవాళ కాకపోతే రేపైనా చెల్లి ఏపీలో పవర్ సెంటర్ అయితే ఇబ్బంది అవుతుందని అందుకే ఆమెకు తెలంగాణ కార్యక్షేత్రం అప్పగించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
undefined
వైసీపీని మళ్లీ రివైవ్ చేయాలంటే.. ఆయన సమస్యలు ఆయనకు ఉంటాయి. అందుకే షర్మిలను స్వతంత్రంగా రాజకీయం చేసేలా ప్రోత్సహించారని అంటున్నారు. షర్మిల పార్టీ పనుల్లో అత్యధికంగా వైసీపీ నేతలే కనిపిస్తున్నారు.
undefined
click me!