నాగార్జునసాగర్ అసెంబ్లీ బైపోల్: గెలుపుకోసం టీఆర్ఎస్ ప్లాన్ ఇదీ

First Published Feb 5, 2021, 12:00 PM IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో  విజయం సాధించడం కోసం  ప్రధాన పార్టీలు  కసరత్తు చేస్తున్నాయి. టీఆర్ఎస్ ఇప్పటికే ఎన్నికల స్రచారంలో ప్రత్యర్ధుల కంటే ముందుంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు అధికార టీఆర్ఎస్ ఇప్పటినుండే కసరత్తు చేస్తోంది. పార్టీ యంత్రాంగాన్ని నియోజకవర్గంలో మోహరించింది.
undefined
గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన అనారోగ్యం కారణంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మరణించాడు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.
undefined
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించాలని ఆ పార్టీ ప్లాన్ చేసింది. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానంలో ఏడు మండలాలు ఉన్నాయి.
undefined
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి గురించి టీఆర్ఎస్ ఇంకా ప్రకటించలేదు. కానీ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య తనయుడు భగత్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
undefined
ఈ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై సీఎం కేసీఆర్ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
undefined
ఈ అసెంబ్లీ స్థానంలో 2,17,142 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లున్నారు. ఇందులో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు సుమారు 35 వేల మంది ఓటర్లు ఉంటారు.
undefined
ఎస్టీల్లో లంబాడా సామాజికవర్గానికి చెందిన ఓటర్లు సుమారు 15 వేలు ఉంటారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు సుమారు 32 వేల మంది ఉంటారు. ఇందులో మాదిగ సామాజకి వర్గానికి చెందినవారే సుమారు 25 వేల మంది ఉంటారని అంచనా.
undefined
సుమారు 20 వేల మంది ముస్లిం ఓటర్లున్నారు. 25 వేల మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లున్నారు. టీఆర్ఎస్ నేతలు ఆయా సామాజికవర్గాల మద్దతును కోరుతున్నారు.
undefined
నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ముస్లిం పెద్దలు కొందరు హైద్రాబాద్ లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీని కలిసి టీఆర్ఎస్ కు తమ మద్దతును ప్రకటించారు.
undefined
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, అంజన్ యాాదవ్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం లు ఆయా మండలాల్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓట్లను టీఆర్ఎస్ వైపునకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.
undefined
ఎమ్మెల్యేలు రవీంద్రనాయక్, శంకర్ నాయక్, రెడ్యానాయక్ లతో పాటు మంత్రి సత్యవతి రాథోడ్ లను టీఆర్ఎస్ నాయకత్వం ఈ నియోజకవర్గానికి ఇంచార్జీలుగా ప్రకటించింది. ఎంపీ మాలోతు కవిత కూడ నియోజకవర్గంలోని గిరిజనులు ఎక్కువగా నివసించే తండాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.
undefined
దళిత, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిదులు కూడ తమకు కేటాయించిన మండలాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.
undefined
ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేనాటికి నియోజకవర్గంలోని తమకు కేటాయించిన మండలాలు, గ్రామాల్లో ప్రచారాన్ని పూర్తి చేయాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొంది.
undefined
ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఆ పార్టీ ముందుకు సాగుతోంది.
undefined
click me!