ఇక తెలంగాణలో పలు జిల్లాల్లో మధ్యస్థ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి... అంటే అటు అత్యల్పం కాదు ఇటు అత్యధికం కాదు. ఇలా హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్,మేడ్చల్ మల్కాజ్ గిరి, నిర్మల్, నిజామాబాద్,పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 11 నుండి 15 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతాయని ప్రకటించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.