తోట ముందు ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రైతు తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు. కనీసం ఈ హెచ్చరికతోనైనా మందుబాబుల ప్రవర్తనలో మార్పు వస్తుందేమోనని ఆశిస్తున్నారు. రైతు మాత్రం తాను పెట్టిన నియమాలను కచ్చితంగా అమలు చేస్తానని చెబుతున్నాడు.
గ్రామస్థుల సపోర్ట్
తన తోటలో అనుమతి లేకుండా మందు సేవించడం, ప్లాస్టిక్ వ్యర్థాలు, బిర్యానీ ప్యాకెట్లు పడేయడం వల్ల సాగు చేయలేని పరిస్థితి ఏర్పడిందని రైతు ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సమస్యపై గ్రామస్థులు కూడా రైతుకు మద్ధతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.