యాదాద్రి ఆలయానికి కిలోన్నర బంగారం విరాళంగా సమర్పించిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ ...

Published : Mar 15, 2022, 12:17 PM IST

తుంగతుర్తి ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్-కమల దంపతులు  యాదాద్రి ఆలయ విమాన గోపురానికి కిలోన్నర బంగారాన్ని సమర్పించారు.  

PREV
112
యాదాద్రి ఆలయానికి కిలోన్నర బంగారం విరాళంగా సమర్పించిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్  ...
Tungaturti MLA Dr. Gadri Kishore

తుంగతుర్తి ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్-కమల దంపతులు యాదాద్రి ఆలయ విమాన గోపురానికి కిలోన్నర బంగారాన్ని సమర్పించారు.
212
Tungaturti MLA Dr. Gadri Kishore

ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ తన వ్యక్తిగతంగా పావుకిలో(25 తులాలు) బంగారం, నియోజకవర్గ ప్రజల తరపున ఒక కిలో 33 తులాలు (మొత్తం 158 తులాల) బంగారాన్ని సమర్పించారు.
312
Tungaturti MLA Dr. Gadri Kishore

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు కల కాలం ఉండాలని కోరుకున్నారు. గతంలో కులాన్ని, మతాన్ని రాజకీయాల కోసం వాడుకున్నారని.. నిజమైన హిందువుగా సీఎం కేసీఆర్ తెలంగాణ ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు.
412
Tungaturti MLA Dr. Gadri Kishore

తెలంగాణ జాతిపిత, సీఎం కేసీఆర్ ఒక సంకల్పంతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేందుకు ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించాలని నిర్ణయించి ఆదిశగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తెలిపారు. 
512
Tungaturti MLA Dr. Gadri Kishore

అటువంటి మహా ఆలయ విమాన గోపురాన్ని బంగారు తాపడంతో చేయాలని తలచి ఎవరికి వారుగా సహాయం చేయాలనే సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మా తుంగతుర్తి నియోజకవర్గం ప్రజల తరుపున కేజీన్నర(158 తులాలు) బంగారాన్ని యాదాద్రి దేవస్థానానికి సమర్పించామని ఎమ్మెల్యే కిశోర్ కుమార్ వెల్లడించారు. 
612
Tungaturti MLA Dr. Gadri Kishore

ఈ మహత్తర కార్యక్రమంలో అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు కిశోర్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ పై లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు కల కాలం ఉండాలని తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల తరుపున యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పేర్కొన్నారు.  
712
Tungaturti MLA Dr. Gadri Kishore

ఈ మహత్తర కార్యక్రమంలో అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు కిశోర్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ పై లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు కల కాలం ఉండాలని తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల తరుపున యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పేర్కొన్నారు.  
812
Tungaturti MLA Dr. Gadri Kishore

రకరకాలుగా మాట్లాడుతున్న నేతలు గతంలో కులాన్ని, మతాన్ని రాజకీయాల కోసం వాడుకున్నారని.., దేవాదాయ శాఖ నుంచి నిధులను తీసుకున్నారు గానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాలయాల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని గుర్తు చేశారు. 
912
Tungaturti MLA Dr. Gadri Kishore

దేవాలయాల అభివృద్ధి విషయంలో గానీ, అర్చకులను పట్టించుకునే విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపారని అన్నారు. 
1012
Tungaturti MLA Dr. Gadri Kishore

నిజమైన హిందువుగా తెలంగాణ ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే సోయి ఉన్న నేతగా ఆయుత చండీయాగం చేసి తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్ పరితపించారని. నాటి నుంచి తెలంగాణలో వర్షాలు భారీగా కురుస్తున్నాయని, తెలంగాణ పల్లెలు ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నాయని ఎమ్మెల్యే కిశోర్ కుమార్ తెలిపారు.
1112
Tungaturti MLA Dr. Gadri Kishore

నిజమైన హిందువుగా తెలంగాణ ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే సోయి ఉన్న నేతగా ఆయుత చండీయాగం చేసి తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్ పరితపించారని. నాటి నుంచి తెలంగాణలో వర్షాలు భారీగా కురుస్తున్నాయని, తెలంగాణ పల్లెలు ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నాయని ఎమ్మెల్యే కిశోర్ కుమార్ తెలిపారు.
1212
Tungaturti MLA Dr. Gadri Kishore

తుంగతుర్తి ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్-కమల దంపతులు. వారి ఇద్దరు కుమారులు. స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన సందర్భంలో
Read more Photos on
click me!

Recommended Stories