Sajjanar: హైదరాబాద్‌ నుంచి నల్గొండకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సజ్జనార్.. తనదైన స్టైల్‌లో

First Published Nov 6, 2021, 1:15 PM IST

తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ (Sajjanar) తనదైన శైలిలో దూకుడు కనబరుస్తున్నారు. తాజాగా ఆయన హైదరాబాద్ (Hyderabad) నుంచి నల్గొండ (Nalgonda) వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.

తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ (Sajjanar) తనదైన శైలిలో దూకుడు కనబరుస్తున్నారు. సంస్థను అభివృద్దిలోకి తీసుకురావడానికి నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా.. ఆర్టీసీ బస్సులపై జనాల్లో నమ్మకాన్ని కలిగించేందుకు కూడా ఆయన కృషి చేస్తున్నారు. 

తాజాగా హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సజ్జనార్.. అక్కడి బస్టాండ్ తనిఖీలు చేపట్టారు. బస్టాండ్‌లలో అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉన్నాయో..? లేదో..? తెలుసుకోవడానికి స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. ఆర్టీసీ బస్టాండ్‌లో సౌకర్యాల గురించి ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఇక, నల్గొండ బస్టాండ్‌లో ఉన్న స్టాల్స్‌ను పరిశీలించారు. అందులో అమ్ముతున్న తినుబండరాలను కూడా పరిశీలించారు. అంతేకాకుండా బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న బస్సులను కూడా పరిశీలించారు. అలాగే నల్గొండ రీజియన్ ఆర్టీసీ అధికారులతో సజ్జనార్ సమావేశమయ్యారు. అలాగే ఆర్టీసీకి సంబంధించిన కార్గో సేవలను కూడా ఆయన ఈ సందర్భంగా సజ్జనార్ పరిశీలించారు. సజ్జనార్ ఇలా చేయడం చూసిన నెటిజన్లు.. ఆయన చర్యలను ప్రశంసిస్తున్నారు. 

అదే విధంగా బస్టాండ్ ఆవరణలో ఎలాంటి అనుమతులు లేకుండా అటించిన పోస్టర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై హైదరాబాద్, వరంగల్‌లో కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సురక్షితమైన ప్రయాణం ఆర్టీసీతోనే సాధ్యమని అని చెప్పారు. అలాగే నల్గొండ రీజియన్ ఆర్టీసీ అధికారులతో సజ్జనార్ సమావేశమయ్యారు. అలాగే ఆర్టీసీకి సంబంధించిన కార్గో సేవలను కూడా ఆయన ఈ సందర్భంగా సజ్జనార్ పరిశీలించారు. సజ్జనార్ ఇలా చేయడం చూసిన నెటిజన్లు.. ఆయన చర్యలను ప్రశంసిస్తున్నారు. 

ఇక, ఇంతకుముందు సజ్జనార్.. హైదరాబాద్ నగరంలోని సిటీ బస్సులో సాధారణ ప్రయాణికుడిగా టికెట్ తీసుకుని ప్రయాణం చేశారు. ఈ సమయంలో బస్సుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుడా MGBS పరిసరాలను పరిశీలించారు. అక్కడ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 

వినాయక నిమజ్జనానికి కూడా Sajjanar ఫ్యామిలీతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ విధంగా ప్రయాణికులకు ఆర్టీసీపై నమ్మకం కలిగించే విధంగా సజ్జనార్ తనదైన శైలిలో కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే విధంగా సింప్లిసిటీ చాటుకుంటున్నారు. 

click me!