వరంగల్ : బీహార్ నుంచి సికింద్రాబాద్ కు మైనర్ బాలలను తరలిస్తున్న దళారులను కాజీపేట రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 34 మంది మైనర్ బాలలను రక్షించారు. చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, కాజీపేట రైల్వే స్టేషన్ ఆర్పిఎఫ్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టి ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. దర్భంగా ఎక్స్ప్రెస్ రైలులో బీహార్ నుంచి సికింద్రాబాద్ కు మొత్తం 34 మంది బాలలను తరలిస్తున్నారు.