టీపీసీసీ చీఫ్ పదవికి రేసులో కాంగ్రెస్ సీనియర్లు: లాబీయింగ్ చేస్తున్న నేతలు

First Published Dec 7, 2020, 4:33 PM IST

టీపీసీసీ చీఫ్ పదవికి కాంగ్రెస్ సీనియర్లు రేసులో ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి  పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు.ఈ రాజీనామాను పార్టీ నాయకత్వం ఆమోదించలేదు. గతంలో కూడ తనను తప్పించాలని  ఉత్తమ్ పార్టీ నాయకత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ పదవి రేసులో పలువురు నేతలు క్యూ కట్టారు. తమకు ఈ పదవిని అప్పగించాలని నేతలు కోరుతున్నారు.
undefined
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలకే పరిమితమైంది.ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహన్ని నింపాయి. దీంతో టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు.
undefined
పీసీసీ చీఫ్ పదవికి పోటీ ఎక్కువగా ఉంది. మూడు రోజుల క్రితం సీనియర్ నేతలు సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ పదవి విషయమై చర్చించారు. నేతల మధ్య పీసీసీ చీఫ్ పదవి విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు.
undefined
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ పీసీసీ చీఫ్ పదవి కోసం నేతల నుండి అభిప్రాయాలను సేకరించే అవకాశం ఉంది.
undefined
నేతల నుండి తీసుకొన్న సమాచారాన్ని ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు ఆయన నివేదిక సమర్పిస్తారు.
undefined
ఈ నివేదిక ఆధారంగా ఎఐసీసీ కొత్త పీసీసీ చీఫ్ ను ఎంపిక చేయనున్నారు.టీపీసీసీ చీఫ్ పదవి రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
undefined
పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ నేతలకు చెప్పినట్టుగా సమాచారం. పార్టీలోని అన్ని నేతలకు ఆమోదయోగ్యమైన నేతగా మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు పేరుంది. శ్రీధర్ బాబుకు ఈ పదవిని ఇస్తే అందరూ నేతలు కూడా సహకరించే పరిస్థితి ఉందనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.
undefined
శ్రీధర్ బాబుకు కాకపోతే తమకు ఈ పదవిని ఇవ్వాలని ఈ పదవిని ఆశిస్తున్న నేతలు పార్టీ నేతలు కోరుతున్నారు.
undefined
బీసీ సామాజికవర్గానికి చెందిన మధు యాష్కీ, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య తదితరులు కూడ పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారని సమాచారం.
undefined
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తాను కూడ పీసీసీ చీఫ్ పదవి రేసులో ఉన్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే.
undefined
మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ లు కూడ పీసీసీ రేసులో ఉన్నట్టుగా సమాచారం.
undefined
మరోసారి రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా బీసీ సామాజికవర్గానికి చెందినవారికి పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.పీసీసీ చీఫ్ ను మార్చాలని నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో వరుస ఓటములు కూడ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి.
undefined
జీహెచ్ఎంసీ ఎన్నికల ఓటమి ఆ పార్టీ శ్రేణులను మరింత కుంగదీసింది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలంటే పార్టీకి నూతన నాయకత్వం తీసుకురావాలని నేతలు కోరుతున్నారు.
undefined
పార్టీ కోసం సమయమిచ్చి పనిచేసే నేతలకు పార్టీ పదవులు కట్టబెట్టాలనే డిమాండ్ కూడ నెలకొంది.
undefined
click me!