జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక: అందరి చూపు ఎంఐఎంపైనే

First Published Dec 6, 2020, 2:57 PM IST

జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు రెండు పార్టీల మధ్య పొత్తు పెట్టుకోోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. ఏ పార్టీకీ కూడ ప్రజలు స్పష్టమైన మెజారిటీని ఇవ్వలేదు. దీంతో అందరి చూపు ఎంఐఎంపైనే ఉంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీని ఇవ్వలేదు. రెండు పార్టీలు కలిస్తేనే మేయర్ పీఠాన్ని దక్కించుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎంఐఎం వైఖరి ఎలా ఉంటుందనే విషయమై సర్వత్రా నెలకొంది.
undefined
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 149 డివిజన్ల ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. మరో డివిజన్ ఫలితాన్ని ప్రకటించాల్సి ఉంది. 44 స్థానాలను కైవసం చేసుకొన్న ఎంఐఎం పైనే అందరి చూపు పడింది. టీఆర్ఎస్ కు అంశాల వారీగా ఎంఐఎం మద్దతు ఇస్తోందని ఇటీవలనే ఓ ఇంటర్వ్యూలో కేటీఆర్ ప్రకటించారు. ఈ రెండు పార్టీల మధ్య స్నేహం కొనసాగుతోంది.
undefined
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యులను కలుపుకొన్న మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మరో పార్టీ మద్దతు తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి టీఆర్ఎస్ కు నెలకొంది. దీంతో ఎంఐఎం సహకారాన్ని టీఆర్ఎస్ కోరే అవకాశం లేకపోలేదనే చర్చ కూడ ఉంది. అయితే ఎంఐఎం సహకారం కోరితే ఆ పార్టీ నుండి ఎలాంటి డిమాండ్లు వస్తాయనే విషయమై కూడ టీఆర్ఎస్ నాయకత్వం ఆలోచిస్తోంది.
undefined
మేయర్, డీప్యూటీ మేయర్ పదవులను టీఆర్ఎస్, ఎంఐఎంలు తీసుకొంటాయా.. లేదా రెండున్నర ఏళ్ల పాటు మేయర్ పదవిని రెండు పార్టీలు పంచుకొంటాయా...మరో ఫార్మూలాతో ముందుకు వస్తారా అనే విషయమై రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
undefined
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ నాయకత్వం తమను మద్దతు కోరలేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఒకవేళ టీఆర్ఎస్ మద్దతు కోరితే ఈ విషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకొంటామని ఆయన స్పష్టం చేశారు.
undefined
కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ కార్పోరేటర్లతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ఆదివారం నాడు కేటీఆర్ ఆదివారం నాడు తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు.
undefined
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం 44 మంది సభ్యులను గెలుచుకొంది. ఆ పార్టీకి మరో 10 మంది ఎక్స్ ఆఫిషియో సభ్యుల బలం ఉంది.జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సమయంలో టీఆర్ఎస్, ఎంఐఎం నేతల మధ్య కూడ విమర్శలు చోటు చేసుకొన్నాయి.
undefined
బీజేపీ, ఎంఐఎం మధ్య పొత్తు కుదిరే అవకాశమే లేదు. ఈ రెండు ధృవాలు ఎప్పుడూ కూడ కలవబోవని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం కార్పోరేటర్లతో నిర్వహించిన సమయంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
undefined
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్ కు ఎంఐఎం సహకరిస్తోందా... సహకరిస్తే ఎలాంటి డిమాండ్లను ఆ పార్టీ ముందుకు తెస్తోందనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు ఇంకా రెండు మాసాల సమయం ఉందని మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
undefined
click me!