తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో చేయూత ఒకటి. ఈ పథకం కింద వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, చేనేత, గీత, ఫైలేరియా, హెచ్ఐవీ, డయాలసిస్ బాధితులకు పింఛన్ అందిస్తున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రతీ నెల ప్రభుత్వం రూ. 2,016 అందిస్తోంది. నెలనెలా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుంది. ఈ పథకం ద్వారా ఏటా రూ. 24,192 లభిస్తోంది.