ఇదిలావుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ను దెబ్బతీసేందుకు ఆయనగురించి అంతా తెలిసిన ఈటల రాజేందర్ ను వాడుకుంటోంది బిజెపి. బిఆర్ఎస్ పార్టీలో కీలక బాధ్యతలు వహించిన అనుభవం, సీఎం కేసీఆర్ రాజకీయాలు ఎలా వుంటాయో తెలియడమే ఇప్పుడు ఈటలకు కలిసి వచ్చింది. దీంతో ఇప్పటికే అసెంబ్లీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ గా ఈటలకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది బిజెపి అధిష్టానం. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడించే మరో బాధ్యతను ఈటలకు అప్పగించింది.