ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ మండలాల్లో గోదాముల నిర్మాణానికి అనువైన స్థలాల ఎంపిక జరగుతోంది. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎక్కువగా నిర్మాణాలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ గోదాములు గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయనున్నారు.నిర్మాణ బాధ్యతలు మహిళా రైతు సంఘాలు, మండల సమాఖ్యలకే అప్పగించనున్నారు. నిర్మాణాల పర్యవేక్షణ బాధ్యతను రాష్ట్రస్థాయి సంస్థ అయిన సెర్ప్ (SERP) నిర్వహిస్తుంది. శిక్షణ, మౌలిక సదుపాయాలపై సెర్ప్ సూచనలు అందించనుంది.