కొండా సురేఖ
కొండా సురేఖ 1995లో మండల పరిషత్ కు, 1996లో పీసీసీ సభ్యురాలిగా, 1999లో శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో ఆమె కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కోశాధికారిగా, మహిళా & శిశు సంక్షేమ కమిటీ, ఆరోగ్యం, ప్రాథమిక విద్య స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. 2000లో ఏఐసీసీ సభ్యురాలిగా ఉన్నారు. 2023 ఎన్నికల్లో వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.