అతి తక్కువ విద్యార్హతలు అంటే టెన్త్, ఐటిఐ, ఇంటర్మీడియట్ చదివినవారు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు... వీరికి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉన్నాయని నిర్వహకులు చెబుతున్నారు. ఇక డిగ్రీ, ఎంబిఏ, బిటెక్, పిజీ, ఫార్మసీ చదివినవారు మంచి హోదా, సాలరీతో కూడిన ఉద్యోగాలను పొందవచ్చని అంటున్నారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) తో పాటు ఫార్మా, హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, బయోటెక్, డిజిటల్ మీడియా, మ్యాన్యూఫ్యాక్చరింగ్, కాల్ సెంటర్, అడ్మినిస్ట్రేషన్ తో పాటు అనేక రంగాలకు చెందిన కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. విద్యార్హలతో పాటు ఇంటర్వ్యూలో కనబర్చే ప్రదర్శన ఆదారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. కాబట్టి ఈ జామ్ మేళాలో పాల్గొనే యువతకు కాస్త ప్రిపేర్ అయితే ఉద్యోగం పక్కా.