తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి ఉచితంగా బైక్‌లు, స్కూటీలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే

Published : Jul 05, 2026, 11:12 AM IST

Telangana: తెలంగాణ ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీల ఆర్థిక సాధికారతకు మరో కీలక అడుగు వేసింది. స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో బైక్‌లు, స్కూటీలు, ఈ-స్కూటీలు, కుట్టు మిషన్లు, చిన్న వ్యాపార యూనిట్ల కోసం కొత్త ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించింది. 

PREV
15
క్రిస్టియన్ మైనార్టీల కోసం కొత్త స్వయం ఉపాధి పథకం

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. మహిళలు, యువత తమ సొంత ఉపాధిని ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. కుట్టు మిషన్లు, మోటార్ బైక్‌లు, స్కూటీలు, ఈ-స్కూటీలు, చిన్న వ్యాపార యూనిట్లను అర్హులైన లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ పథకం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు స్వయం ఉపాధికి ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

25
ఆన్‌లైన్ దరఖాస్తులు ఎలా చేసుకోవాలి?

దరఖాస్తు ప్రక్రియ జూలై 3 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు జూలై 18 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం ప్రారంభించిన TS OBMMS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. సందేహాల నివృత్తి కోసం 040-23391067 హెల్ప్‌లైన్‌ను కూడా అందుబాటులో ఉంచారు.

35
అర్హతలు ఏమిటి?

పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిమితి రూ.1.50 లక్షలు. కుట్టు మిషన్, చిన్న వ్యాపార యూనిట్ల కోసం దరఖాస్తు చేసే వారి వయస్సు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. బైక్, స్కూటీ, ఈ-స్కూటీ వంటి రవాణా యూనిట్ల కోసం దరఖాస్తు చేసే వారి వయస్సు 21 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

45
పారదర్శక ఎంపిక.. యువతకు ప్రాధాన్యం

లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. అర్హత ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే ఎంపిక చేపడతారు. ముఖ్యంగా స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందాలనుకునే యువత, మహిళలకు ఈ పథకం మంచి అవకాశంగా అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనార్టీ కుటుంబాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ సూచించింది.

55
ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం లక్ష్యం

ఈ పథకం ద్వారా యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బైక్‌లు, స్కూటీలు, చిన్న వ్యాపార యూనిట్లు, కుట్టు మిషన్ల ద్వారా ఆదాయ వనరులు పెంచుకుని ఆర్థికంగా బలోపేతం కావచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో క్రిస్టియన్ మైనార్టీల జీవనోపాధిని మెరుగుపరచడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories