ఇదిలా ఉంటే 2023-24 24 ఏడాదిలో పబ్లిక్ మార్కెట్ నుంచి రూ. 49,618 కోట్ల అప్పులు తీసుకున్నట్టు కాగ్ తెలిపింది. గడిచిన ఏడాది FRBM పరిది సుమారు 200 శాతం పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. పలు కార్పొరేషన్ల ద్వారా సుమారు రూ. 2.20 లక్షల కోట్ల అప్పు తీసుకున్నట్లు కాగ్ తెలిపింది. ఇక కాగ్ రిపోర్టులో వేతనాల కోసం రూ.26,981 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొన్నారు.
2023-24లో స్థానిక సంస్థలతో పాటు ఇతర సంస్థలకు రూ. 76,776 కోట్ల చెల్లింపులు జరిగాయని, స్థానిక సంస్థలకు 11 శాతం నిధులు పెంచినట్లు కాగ్ తెలిపింది. ఇక 2022-24లో ప్రభుత్వం సుమారు రూ. 53,144 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ తెలిపింది. బడ్జెట్ అంచనాలో సుమారు 79 శాతం వ్యయం అయిందని, ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా 33 శాతం ఖర్చు అయినట్లు తెలిపింది. దీని విలువ రూ. 1,11,477 కోలుగా కాగ్ నివేదికలో పేర్కొంది.